సీనియర్ నటుడు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి గురించి ప్రత్యేక పరిశ్రమ కరలేదు. తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సంగతి మన అందరికీ తెలిసిందే. నరేష్ మీద ఎవరు ఊహించిన విధంగా ఆరోపణలు చేశారు ఈమె. ఇందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ.." నేను విడాకులు కోరుకోవడం లేదు. నరేష్ నాకు ఎప్పటికీ కావాలి అంటూ మాట్లాడిన ఈమె తాజాగా మరొక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగానే యాంకర్ తనను..నరేష్ కి వందల కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆస్తులపైన మీరు కన్నేసారట.. అంతేకాదు నరేష్ పేరు చెప్పి చాలా అప్పులు కూడా చేశారంట అని అడగగా.. 

రమ్య ఆయన ఆస్తిని నేను ఎప్పుడూ కోరుకోలేదు... భార్యగా ఉండాలి అని అనుకున్నాను.. డబ్బులు కావాలంటే నేను నరేష్ కి విడాకులు ఇస్తే నరేష్ నాకు కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు.. అయితే మా మధ్య మనస్పర్ధలు ఉన్నాయి.. అన్నమాట నిజమే.. అవి సర్దుమనగడానికే మాత్రమే నేను కోర్టులో పిటిషన్ వేసాను.. కానీ విడాకుల కోసం కాదు ...ఇక ఆయన పేరు చెప్పి నేను అప్పులు చేశాను అన్న వార్తలో ఎలాంటి నిజం లేదు. నేను చేస్తున్న వ్యాపారం లో లాభాలు రాకపోవడంతో అలాంటి పరిస్థితుల్లో నేను అప్పు చేయాల్సి వచ్చింది. నాకు మా అమ్మగారు వాళ్ళు ఇచ్చిన ప్లాట్ ను నేను తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నాను.

నేను చేసిన అప్పులకి గాను నరేష్ ఇప్పటిదాకా ఎలాంటి సంతకాలు చేయలేదు. కనీసం హామీ ఉండి కూడా నాకు లోన్స్ ఇప్పించలేదు. ఇప్పటివరకు నరేష్  వెనకుండి ఇవన్నీ చేస్తున్నారు .నేను ఆయన దగ్గర నుండి డబ్బులు కోరుకోవడం లేదు. ప్రస్తుతం ఆయన కొడుకు మెయింటెనెన్స్ కి గాను నెలకి 70000 ఇస్తున్నాడు గతంలో 50,000 ఇచ్చేవాడు.ఇక అది కూడా ఒక మూడేళ్ల నుండి ఇస్తున్నాడు. ఇన్ని గొడవలు అవుతున్నప్పటికీ నేను నరేష్ ని భర్తగా కోరుకోవడానికి ఒకే ఒక్క కారణం ఉంది. అది కూడా నా కొడుకు కోసమే. నా కొడుకు తండ్రి కావాలి అని కోరుకుంటున్నాను. అందుకే నేను విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా లేను అంటూ చెప్పుకొచ్చింది రమ్య..!!

మరింత సమాచారం తెలుసుకోండి: