నందమూరి కుటుంబం నుండి ఇప్పటికే ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో నందమూరి బాలకృష్ణ మరియు జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మోక్షజ్ఞ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడు అన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయానికి సంబంధించి ఇప్పటికీ క్లారిటీ మాత్రం రాలేదు. అయితే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. 

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ఆయన గతేడాది హీరోగా నటించిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అనంతరం ఈ సినిమా విషయంలో కూడా చాలా నమ్మకంగా ఉన్నాడు. అదే ఊపులో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు బాలయ్య. ఒకవైపు సినిమాలు మరోవైపు స్టాపబుల్ షో కి పోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇక స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే పాటలు పోస్టర్లు మరియు ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్ ను అందుకుంది.  ఈ సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియో ని కూడా విడుదల చేశారు చిత్ర బృందం.

ఇక ఆ వీడియోలో భాగంగా సినిమా సెట్ లో బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ కూడా సందడి చేయడం మనం చూడొచ్చు. దీంతో చాలామంది ఈ వీడియో చూసిన నందమూరి అభిమానులు మోక్షజ్ఞ త్వరలోనే తన తండ్రితో కలిసి సినిమా చేయడం కన్ఫామ్ అని అంటున్నారు.మోక్షజ్ఞ కి ప్రస్తుతం 28 ఏళ్లు అయినప్పటికీ సినిమాల్లో మాత్రం ఎంట్రీ ఇవ్వలేదు. అయితే దీనికి కారణం ఆయనకి నటన ఇష్టం లేదు అని ఇప్పటికే చాలా వార్తలు రావడం జరిగింది.మోక్షజ్ఞ కి బిజినెస్ అంటే ఇష్టమని నేను నటనకి సెట్ కాను అని బాలయ్యతో చాలాసార్లు మోక్షజ్ఞ చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనికిగాను బాలయ్య ప్రత్యేక పూజలు కూడా చేశాడట. ఇదిలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞ ఈ ఏడాది ఆదిత్య 369 సీక్వెల్ తో ఆదిత్య 999 సినిమాతో ఎంట్రీ ఇవ్వనన్నాడు అని సమాచారం. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాట్లాడుతూ చెప్పాడు. ఏదైనాప్పటికీ బాలకృష్ణ తన కొడుకుని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: