సిద్ధార్థ్ మల్హోత్రా మరియు కియారా అద్వానీ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో జరగబోయే వారి పెళ్లి వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.

ఇప్పుడు సిద్ధార్థ్ మరియు కియారా వివాహానికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వైరల్ అవుతున్నాయి. ఇండియా టుడే అందించిన ఒక నివేదిక ప్రకారం, సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీల వివాహం బ్యాండ్-బాజాతో పాటు అన్ని ఆచారాలతో పూర్తి పంజాబీ పద్దతిలో జరగనుందని సమాచారం.వివాహ వేడుక జైసల్మేర్లో రెండు రోజుల పాటు జరుగుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వివాహ వేడుక తర్వాత, ఈ జంట ముంబైలో తమ సన్నిహితులు మరియు తమ ప్రియమైన వారి కోసం రిసెప్షన్ను కూడా నిర్వహించనుంది.

ఫిబ్రవరిలో సిద్ధార్థ్ మల్హోత్రా మరియు కియారా అద్వానీల వివాహానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు గా కూడా కనిపిస్తోంది. ఒక నివేదిక ప్రకారం హల్దీ పంక్షన్, సంగీత్ ఫంక్షన్ ఒకే రోజు జరగనుంది. మరుసటి రోజు మరికొన్ని వేడుకలు జరగనున్నాయి. వీరి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు పెళ్లి దుస్తులను కొనుగోలు చేయడం ప్రారంభించారని తెలుస్తుంది.

కియారా మరియు సిద్ధార్థ్కి మ్యూజిక్ ప్లేలిస్ట్ కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.కియారా సన్నిహితులొకరు ఇండియా టుడేతో మాట్లాడుతూ, "కియారా న్యూ ఇయర్ సందర్భంగా దుబాయ్లో తన స్నేహితులతో ఒక మ్యూజిక్ ప్లేలిస్ట్ గురించి చర్చిస్తున్నట్లు అయితే సమాచారం.షేర్ షా ఇద్దరికీ పెద్ద హిట్ కావడంతో, ఈ జంటలు రతన్ లంబియాన్ పాటలో డ్యాన్స్ చేయగలరని కూడా భావిస్తున్నానన్నారు. పెళ్లి తేదీ ఎప్పుడు? మీడియాకు అందిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి మొదటి వారంలో సిద్ధార్థ్, కియారా వివాహం చేసుకోబోతున్నారని హల్దీ, మెహందీ, సంగీత్ వంటి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ఫిబ్రవరి 4, 5 తేదీల్లో జరుగనుండగా, ఫిబ్రవరి 6న వీరి రాచరిక వివాహ వేడుక వైభవంగా జరగనుందని సమాచారం.. వేదిక కూడా ఖరారైందని, జైసల్మేర్ ప్యాలెస్ హోటల్లో పెళ్లి జరగనుందని తెలుస్తుంది.. వేదిక వద్ద గట్టి బందోబస్తు కూడా నిర్వహించనున్నారు. ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యే ముందు ఫిబ్రవరి 3న జైసల్మేర్కు సెక్యూరిటీ సిబ్బంది మరియు బాడీ గార్డులను తరలించనున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: