మెగాస్టార్ చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసింది. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... ఊర్వసి రౌటేల ఈ మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ సినిమాలో కేథరిన్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించగా ... మాస్ మహారాజ రవితేజమూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు.

ప్రకాష్ రాజ్ ... బాబి సింహమూవీ లో విలన్ పాత్రలలో నటించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా నిన్న అనగా జనవరి 13 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు అదిరిపోయే రేంజ్ ఓపెనింగ్ లు కూడా లభించాయి. అలాగే రెండవ రోజు కూడా ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటువంటి  నేట్ ఫ్లిక్స్  సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ ని కొన్ని వారాల ధియేటర్ రన్ తర్వాత నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: