మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యకాలంలో కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా పోయిన సంవత్సరం చిరంజీవి రెండు మూవీలతో ప్రేక్షకులను పలకరించగా , ఈ సంవత్సరం ప్రారంభంలోనే చిరంజీవి "వాల్తేరు వీరయ్య" మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి బాబీ దర్శకత్వం వహించగా , శృతి హాసన్ ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించింది.

దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ మూవీ ని మైత్రి సంస్థ నిర్మించగా , మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ సినిమాలో క్యాథరిన్ , రవితేజ భార్య పాత్రలో నటించగా , ప్రకాష్ రాజ్ , బాబి సింహ విలన్ పాత్రలో నటించారు. ఈ మూవీ లో బాస్ పార్టీ అనే స్పెషల్ సాంగ్ లో ఊర్వసి రౌటెల నటించింది. ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ విడుదలకు ముందు నుండే ఈ సినిమాపై యుఎస్ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

దానితో ఈ మూవీ కి యుఎస్ లో మంచి ఫ్రీ సేల్స్ కూడా జరగాయి. ఈ మూవీ విడుదల అయిన తర్వాత ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ రావడంతో యుఎస్ లో ఈ మూవీ కి ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు లభిస్తున్నాయి. దానితో ఈ సినిమా తాజాగా యూఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర 2 మిలియన్ కలెక్షన్లను సాధించింది. ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను యూఎస్ లో శ్లోక ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీగా విడుదల చేసింది. ప్రస్తుతం కూడా ఈ సినిమాకు యూఎస్ లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: