ఆ తర్వాత కొన్నాళ్లకు రాజకీయాల మీద ఆసక్తి రావడంతో టీడీపీలోకి వచ్చి.. అక్కడ ఫైర్ బ్రాండ్ గా చెలరేగి పోయారు.. అనూహ్యంగా పార్టీ నుండి బయటకు వచ్చేశారు దివ్యా వాణి.అయితే దీనిపై తాజాగా స్పందిస్తూ పార్టీలో కొంతమంది వల్లే తాను బయటకు వచ్చేసానని అలాగే ఇవన్నీ అధిష్టానానికి తెలియదని కూడా ఆమె తెలుపుకొచ్చారు. అధిష్టానం నుండి ఆమెకు ఏమి కావాలంటే అవి ఇవ్వాలని చెప్పిన కానీ కొంతమంది నేతలు తనను బాగా అవమానించారని ఆమె తెలిపారు..
ఇకపోతే టిడిపి నుంచి బయటకు వచ్చేటప్పుడు బాలకృష్ణ ఇంటికి నేను వెళ్లాను.. నాకు జరిగిన అవమానం గురించి చెప్పుకొని ఎంతో బాధ పడ్డాను.. నన్ను వేధించిన నాయకుల గురించి కూడా ఆయనకు చెప్పాను.. అప్పుడు బాలకృష్ణ నేను చూసుకుంటానని.. వీటి గురించి ఇతరుల నుంచి కూడా సమాచారం వచ్చిందని.. మీరు బాధపడద్దని కూడా నాతో అన్నారు అయితే నేను పార్టీని వీడక తప్పలేదు అంటూ కూడా తెలిపారట దివ్యవాణి.. అయితే కొంతమంది ఆమె టిడిపి పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా విమర్శలు చేయడంతో ఆమె ఎంతో బాధ పడ్డారు.
అయితే ఆ ప్రెస్ మీట్ తర్వాత ఈ రాజకీయాలు అవసరమా అని కుటుంబ సభ్యులు కూడా అడిగారని, తన కుమార్తె కూడా నువ్వేంటో తమకు తెలుసునని,, బాధపడొద్దు అని కూడా చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె వైసీపీలోకి వస్తున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.