టాలీవుడ్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది పూజ హెగ్డే .ఈ పేరు తెలియని తెలుగు రాష్ట్ర ప్రజలు ఉండరు అంటే ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు .ముకుందా సినిమాతో మొదటిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె దాని అనంతరం అలా వైకుంఠపురం సినిమాలో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని దక్కించుకుంది .చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేరింది పూజ హెగ్డే .అనంతరం స్టార్ హీరోల్లో సరసన హీరోయిన్గా నటించే అవకాశాన్ని దక్కించుకుంటూ వస్తోంది .మొదట్లో ఈమె ఏ సినిమా చేసినప్పటికీ ఫ్లాప్ అని అందరూ అంటుండేవారు .

ఐరన్ లెగ్ హీరోయిన్ అని కూడా తనకి ఒక పేరుని పెట్టారు .అందం ఉన్నప్పటికీ నటించే టాలెంట్ తనలో లేదు అని అప్పట్లో చాలామంది ఈమెని విమర్శించారు .దాని అనంతరం ఎన్టీఆర్ తో కలిసి నటించిన అరవింద సమేత సినిమాతో ఈమె మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది అని చెప్పాలి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం కావడంతో ఐరన్ లెగ్ గా పిలిచి పూజా హెగ్డే పేరు మారిపోయింది అనడంలో ఇలాంటి సందేహం లేదు. దాని అనంతరం ఆమె నటించిన సినిమాలన్నీ కూడా వెంటవెంటనే బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి .దాంతో పూజా హెగ్డే గ్రీస్ మరింత పెరిగిపోయింది. దీంతో బుట్ట బొమ్మ అనే ఒక పేరును కూడా సంపాదించుకుంది పూజ హెగ్డే.

అయితే కరోనా తరువాత పూజ హెగ్డే కి క్రమంగా సినిమా అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక కరోనా తర్వాత ఈమె చేసిన సినిమాలన్నీ కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది పూజ హెగ్డే. బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వడంతో తెలుగు డైరెక్టర్ లతో పరిచయాన్ని కూడా కోల్పోయింది. బాలీవుడ్ కి వెళ్లిపోవడంతో ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమా అవకాశాలు లేక సతమతమవుతోంది పూజా హెగ్డే. గతంలో ఆమె మూడు కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకునేది. కానీ ఇప్పుడు మాత్రం పూజ హెగ్డే చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. దీంతో పూజా హెగ్డే గ్రీస్ తగ్గిపోయింది అన్న ప్రచారం కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఈమె మహేష్ బాబు సినిమాలో తప్ప మరే సినిమాలో కూడా నటించడం లేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: