2008లో ధనుష్ నయనతార నటించిన మోహిని అనే సినిమాలో నటించి కూడా గుర్తింపును సంపాదించుకుంది. తెలుగులో మొదటిసారి విలేజ్ లో వినాయకుడు అనే సినిమాలో నటించింది. అయితే మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ హ్యాపీ హ్యాపీగా అనే సినిమాలోను నటించి తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక తర్వాత నాని హీరోగా నటించిన భీమిలి కబడ్డీ జట్టు అనే సినిమాలో హీరోయిన్గా నటించగా.. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అటు శరణ్యకు కూడా మంచి గుర్తింపు వచ్చింది అని చెప్పాలి. కానీ ఆ తర్వాత కాలంలో సినిమాలకు దూరమైంది.
శరణ్య తన ప్రియుడు అయిన డాక్టర్ అరవింద కృష్ణన్ ను 2015 సెప్టెంబర్ ఆరవ తేదీన వివాహం చేసుకుంది. అయితే వివాహం తర్వాత సినిమాల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ జంటకు అన్నపూర్ణ అనే కుమార్తె కూడా ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని ఎంతో సంతోషంగా లీడ్ చేస్తుంది ఈ హీరోయిన్. అయితే ఒకప్పుడు అందం అభినయంతో కుర్రకారు మతి పోగొట్టిన ఈ హీరోయిన్ కి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఇది చూసి అభిమానులు అందరూ కూడా మురిసిపోతున్నారు అని చెప్పాలి.