టాలీవుడ్ కింగ్ నాగార్జున.. రచయిత ప్రసన్నకుమార్ బెజవాడను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఒక విలేజ్ ఎంటర్టైన్మెంట్ సినిమాను చేయబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో లో ఈ సినిమా ఉంది.అంతేకాకుండా వచ్చే నెల నుండి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రారంభించాను అన్నారని తెలుస్తోంది. మలయాళం లో సూపర్ హిట్ పురింజు మరియన్ జ్యూస్ అనే సినిమాకి రీమేగా ఈ సినిమా మరికొన్ని కొత్త మార్పులతో తీసుకొచే దిశగా పనిచేస్తున్నాడు ప్రసన్నకుమార్.ఇప్పటికే ఈ సినిమాలో అల్లరి నరేష్ ఒక కీలకపాత్ర పోషిస్తున్నాడని తెలుస్తోంది.

అయితే తాజాగా ప్రసన్న కుమార్ నరేష్ కి స్క్రిప్ట్ క్యారెక్టర్ చెప్పి లాక్కూడా చేసాడని అంటున్నారు. ఈ క్రమంలోని ఈ సినిమాలో మరొక యంగ్ హీరో కూడా ఉండబోతున్నాడని అంటున్నారు.అంతేకాదు కథలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం యంగ్ హీరో రాజ్ తరుణ్ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇకపోతే ఈ యంగ్ హీరో సినిమా చూపిస్త మామ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతోనే ప్రసన్నకుమార్ కూడా రచయితగా పరిచయం అయ్యాడు. అందుకే కారణంగానే రాజ్ తరుణ్ కి ఈ సినిమాలో ఒక కీలక పాత్ర ఇచ్చటని అంటున్నారు. అంతేకాదు రాజ్ తరుణ్ మొదట నటించిన ఉయ్యాల జంపాల సినిమాకి నిర్మాత నాగార్జున.

దీంతో తనకి హీరోగా మొదటి అవకాశాన్ని ఇచ్చిన నాగార్జునతో నటించిన ఒప్పుకున్నాడట .ఇదిలా ఉంటే ఇక శ్రీనివాస చిత్తూరు నిర్మిస్తున్న ఈ సినిమా అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం కూడా జరగనుందిని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ తో పాటు మరికొన్ని కొత్త అప్డేట్ లో కూడా చిత్ర బృందం విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో ఈ సినిమాలో అల్లరి నరేష్ తో పాటు మరొక యంగ్ హీరో అయిన రాజ్ తరుణ్ కూడా నటించడంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: