అక్కినేని అఖిల్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకోవడానికి గత కొంతకాలంగా ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మొదటిగా నటించిన అఖిల్ సినిమా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన హలో సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నారు. ఇక వెంకి అట్లూరి దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ మజ్ను సినిమా కూడా పరవాలేదు అనిపించుకుంది. చివరికి బొమ్మరిల్లు డైరెక్టర్ భాస్కర్త మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ఊహించని విధంగా సక్సెస్ అందుకున్నారు అఖిల్.


ప్రస్తుతం డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న చిత్రం ఏజెంట్. ఈ సినిమా స్పై యాక్షన్ త్రిల్లర్గా రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఎన్నోసార్లు విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడుతూ వస్తోంది. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు సంబంధించి ప్రతి విషయంలో కూడా కాంప్రమైజ్ కావడం లేదు. అందుకే ఈ సినిమా రిలీజ్ చేయాలని సినిమా పర్ఫెక్ట్ గా వచ్చేవరకు ఎదురుచూస్తున్నారు చిత్ర బృందం. ఏప్రిల్ 28వ తేదీన భారీ స్థాయిలో తెలుగు, తమిళ్ ,మలయాళం, కన్నడ, హిందీ వంటి భాషలలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు.


ఇప్పటికే భారీ భజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో పాటు కర్ణాటకలో కూడా థియేట్రికల్ హక్కులను నిర్మాత అనిల్ సుంకర హోల్సేల్గా అమ్మేశారట. దీంతో వితౌట్ జీఎస్టీతో ఈ సినిమా రూ.34 కోట్ల రూపాయలకు అమ్మేసినట్లు సమాచారం. అయితే థియేటర్ రైట్స్ కోసం చాలామంది పోటీపడుతున్న భారీ మొత్తానికి ఏరియా వైజ్ గా థియేట్రికల్ హక్కులను అమ్మేసిన నిర్మాత ఈ సినిమాకి రూ .15 కోట్ల డెఫిషీట్ తో రిలీజ్ చేస్తూ ఉండడంతో  ట్రెండ్ వర్గాలలో హాట్ టాపిక్ గా మారుతోంది.ఈ సినిమా తక్కువ థియేట్రికల్ బిజినెస్ జరిగిందని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ వస్తే ఈ సినిమాకు మంచి టాక్ వస్తే భారీ లాభాలు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: