రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస మూవీ లకు కమిట్ అయి ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ ... ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందుతున్న సలార్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు . ఈ సినిమా తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ కే అనే మూవీ లో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు . 

ఈ రెండు మూ వీల తో పాటు ప్రభాస్ ... మారుతీ దర్శకత్వం లో రూపాందుతున్న మరో మూవీ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు . ఇప్పటి వరకు ఈ సినిమా కు టైటిల్ ను ఈ మూవీ యూనిట్ ఫిక్స్ చేయలేదు . ఈ మూవీ లో ప్రభాస్ సరసన మాళవిక మోహన్ ... నిధి అగర్వాల్ ... రిద్ధీ కుమార్ లు హీరోయిన్ లుగా నటించనుండ గా బాలీవుడ్ క్రేజీ నటుడు సంజయ్ దత్సినిమా లో ఒక కీలక పాత్ర లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది .

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది . ప్రస్తుతం ఈ మూవీ యొక్క షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. హైదరాబాద్ లో ప్రస్తుతం జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ లో ప్రభాస్ మరియు మాళవిక మోహన్ లు పాల్గొంటున్నట్లు తెలుస్తోంది . వీరిద్దరిపై ప్రస్తుతం ఈ చిత్ర బృందం కొన్ని ప్రత్యేక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు ... ఈ సన్ని వేశాలు అద్భుతంగా వస్తున్నట్లు తెలుస్తోంది .



మరింత సమాచారం తెలుసుకోండి: