నందమూరి నట సింహం బాలకృష్ణ ఆఖరు గా వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటి శృతి హాసన్ ... బాలయ్య సరసన హీరోయిన్ గా నటించగా ... మరో కీలకమైన పాత్రలో హాని రోజ్ ఈ సినిమాలో నటించింది. టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి దర్శకుడుగా గుర్తింపును తెచ్చుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించగా ... తమన్మూవీ కి సంగీతం అందించాడు. వరలక్ష్మి శరత్ ... కుమార్ దునియా విజయ్మూవీ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. 

ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ మూవీ లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే థియేటర్ లలో భారీ విజయం అందుకున్న ఈ సినిమా మరి కొన్ని రోజుల్లోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెర ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ సినిమాను ఏప్రిల్ 23 వ తేదీన సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు స్టార్ మా చానల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం చేయనున్నట్లు తాజాగా స్టార్ మా సంస్థ అధికారికంగా ప్రకటించింది. మరి ఇప్పటికే థియేటర్ లలో ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: