విక్టరీ వెంకటేష్ సినిమాల విషానికి వస్తే ఆకరుగా ఎఫ్ 3 అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. తాజాగా వెంకటేష్ "రానా నాయుడు" అనే వెబ్ సిరీస్ లో కూడా కీలక పాత్రలో నటించాడు. రానా కూడా ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించాడు. కొన్ని రోజుల క్రితం నుండి ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" లో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా వెంకటేష్ "కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌" హిందీ మూవీ లో కీలక పాత్రలో నటించాడు.

సల్మాన్ ఖాన్ హీరో గా నటించిన ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ సినిమాను ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వెంకటేష్ "సైంధవ్" అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ లో శ్రద్ధ శ్రీనాథ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ విషయాన్ని ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ యొక్క షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. ప్రస్తుతం వైజాగ్ లో ఈ మూవీ యూనిట్ వెంకటేష్ మరియు శ్రద్ధా శ్రీనాథ్ లపై ఈ మూవీ లోని అత్యంత కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం తెరకెక్కిస్తున్న సన్నివేశాలు ఈ సినిమాలో చాలా హైలైట్ గా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ పై వెంకటేష్ అభిమాను లతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: