రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఈ మూవీ లో ప్రభాస్ సరసన రీథీ కుమార్ ... మాలవికా మోహన్ ... నీది అగర్వాల్ హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు.

సంజయ్ దత్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి అయింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ... మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా యొక్క తాజా షెడ్యూల్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. తాజాగా పూర్తి అయిన షెడ్యూల్ లో ఈ మూవీ బృందం ప్రభాస్ మరియు మాళవిక మోహన్ లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క తదుపరి షెడ్యూల్ మే నెలలో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.

మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ను పెట్టే ఉద్దేశంలో మూవీ బృందం ఉన్నట్లు ఒక వార్త చాలా రోజులుగా వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే దర్శకుడు మారుతి ఆఖరుగా గోపీచంద్ హీరోగా రాశి కన్నా హీరోయిన్ గా రూపొందిన పక్కా కమర్షియల్ అనే మూవీ.కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. మరి పక్కా కమర్షియల్ మూవీ తర్వాత ప్రభాస్ మూవీ తో మారుతి ఏ రేంజ్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: