ఇక రాధేశ్యామ్ సినిమా తర్వాత వరుసగా భారీ బడ్జెట్ సినిమాలని అనౌన్స్ చేసి బాగా బిజీగా అయ్యారు డార్లింగ్ ప్రభాస్.కానీ ఇప్పటి దాకా అసలు మరో రిలీజ్ కాలేదు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు కావడంతో ఆ ప్రాజెక్ట్స్ పై భారీ అంచనాలు  నెలకొన్నాయి. అందులో డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తోన్న ఆదిపురుష్ సినిమా కూడా ఒకటి. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా.. సీతగా కృతి సనన్.. ఇంకా రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. చాలా అంచనాలు నెలకొన్న ఈ సినిమా టీజర్ అభిమానులను నిరాశకు గురిచేసిన సంగతి తెలిసిందే. వీఎఫ్ఎక్స్.. ప్రభాస్, సైఫ్ లుక్స్ పై చాలా విమర్శలు వచ్చాయి. దీంతో జనవరికి విడుదల కావాల్సిన మూవీ జూన్ దాకా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా మరో అరుదైన గౌరవం దక్కించుకుంది.జూన్ 13 వ తేదీన జరిగే.. అంటే విడుదలకు మూడు రోజుల ముందు ట్రిబెకా వేడుకలలో ఈ సినిమాని ప్రీమియర్ చేయనున్నారు. ఈ విషయాన్ని ట్రిబెకా అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా తెలిసింది. 


అలాగే ఈ సినిమా రన్ టైమ్ పై కూడా క్లారిటీ వచ్చేసింది. ఇక ఆ వెబ్ సైట్ ప్రకారం.. ఆదిపురుష్ రన్ టైమ్ 174 నిమిషాలు. అంటే.. 2 గంటల 54 నిమిషాలు ఉంటుంది. గతంలో కూడా ఈ రన్ టైమ్ పై చాలా వార్తలు వినిపించాయి. ముందు ఈ మూవీ 3 గంటల 16 నిమిషాల రన్ టైమ్ ఫిక్స్ చేశారని టాక్ వినిపించింది. లాస్ట్ కి 2 గంటల 54 నిమిషాలు ఫిక్స్ చేశారు. అయితే ఈ రన్ టైమ్ కాస్త ఎక్కువనే చెప్పాలి. ప్రారంభం మొదట్లోనే ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న చిత్రయూనిట్.. ప్రేక్షకులను అంత సమయం ఎంటర్టైన్ చేయగలదా అనే సందేహాలు బాగా వ్యక్తమవుతున్నారు.బాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఓంరౌత్ ఇంకా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు అజయ్ అతుల్ సంగీతం అందిస్తున్నారు. ముందుగా సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన ఈ మూవీ మేకర్స్.. ఆ తర్వాత జూన్ 16 వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మరీ చూడాలి ఆదిపురుష్ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఏ విధంగా మెప్పిస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: