మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'విరూపాక్ష'. 'శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర' 'సుకుమార్ రైటింగ్స్' బ్యానర్లపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించడం జరిగింది.అలాగే సుకుమార్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించడం జరిగింది. అజయ్, యాంకర్ శ్యామల, సునీల్, రాజీవ్ కనకాల, సాయి చంద్ ఇంకా అభినవ్ గోమఠం వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించగా 'కాంతార' ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకి సంగీతం అందించాడు.ఇక ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్, టీజర్ ఇంకా అలాగే ట్రైలర్లకి కూడా సూపర్ రెస్పాన్స్ లభించింది.దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.అందుకు తగ్గట్టు గానే మొదటి రోజు ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి రోజు సూపర్ గా కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండో రోజు, మూడో రోజు కూడా చాలా బాగానే కలెక్ట్ చేసింది.


ఒకసారి ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే..'విరూపాక్ష' సినిమాకి రూ.22.36 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఖచ్చితంగా రూ.22.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి ఈ సినిమా మొత్తం రూ.20.69 కోట్ల షేర్ ను రాబట్టింది.ఇక బ్రేక్ ఈవెన్ కి ఈ సినిమా మరో రూ.2.11 కోట్ల షేర్ ను ఖచ్చితంగా రాబట్టాలి. ఆదివారం రోజు కూడా ఈ సినిమా చాలా బాగా కలెక్ట్ చేసింది. మొదటి సోమవారం రోజున ఈ సినిమా బాగా పెర్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇక గ్రాస్ విషయానికి వస్తే ఈ సినిమా దాదాపు 100 కోట్ల దాకా వసూళ్లు చేసినట్టు సమాచారం తెలుస్తుంది. సినిమాకి ఎలాగో బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో అలాగే వసూళ్లు కూడా బాగా నమోదు కావడంతో ఈ సినిమాని బాలీవుడ్ ఇంకా ఇతర భాషల్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి చూడాలి ఈ సినిమా ఏ విధంగా అక్కడ జనాలని మెప్పిస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: