ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఒకరు. ఈ దర్శకుడు సందీప్ కిషన్ హీరో గా రెజీనా కేసాండ్రా కీలక పాత్రలో రూపొందిన మా నగరం అనే మూవీ తో మంచి విజయాన్ని అందుకొని దర్శకుడు గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఖైదీ మూవీ తో మరో విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ తో ఈ దర్శకుడి క్రేజ్ చాలా బాగా పెరిగి పోయింది. ఆ తర్వాత ఈ దర్శకుడు మాస్టర్ ... విక్రమ్ మూవీ లకు దర్శకత్వం వహించాడు.

ఈ దర్శకుడు ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. లోకేష్ కనకరాజు ఇప్పటికే ఖైదీ ... విక్రమ్ మూవీ లను లింక్ చేస్తూ సినిమాలను రూపొందించి వీటితో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోవడం మాత్రమే కాకుండా ఒక క్రేజీ మూవీ యూనివర్స్ ని కూడా సృష్టించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యూనివర్స్ లోనే తలపతి విజయ్ హీరో గా లియో అనే మూవీ ని ఈ దర్శకుడు రూపొందిస్తున్నాడు.

ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి వెంకట్ ప్రభు ఈ దర్శకుడి గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. లోకేష్ కనకరాజు గారు ఒక క్రేజీ యూనివర్స్ ని సృష్టించారు మరియు ఆ యూనివర్స్ లోనే సినిమాలు చేస్తున్నారు. తమిళ సినిమా ఇండస్ట్రీ కి ఇది ఒక మార్వెల్ యూనివర్స్ లాగా ఉంటుంది అని నేను భావిస్తున్నాను అని తాజాగా వెంకట్ ప్రభు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: