మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇటీవల విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.తెలుగులో ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఈ శుక్రవారం పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైంది. విడుదలైన అనంతరం మిగతా భాషల నుండి కూడా మంచి పాజిటివ్ టాక్ అందుకుంది. ఈ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ సంపత్ నంది డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మధ్యనే ఫ్యాన్స్ తో చిట్ చాట్ జరిపిన తేజ్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. 

సంపత్ నంది సాయి ధరంతేజ్ లో కాంబినేషన్లో ఒక మాస్ మసాలా లాంటి సినిమా రాబోతుందని మెగా అభిమానులు ఆశపడుతున్నారు. సిటీ మార్ సినిమా తర్వాత సంపత్ నంది మరో సూపర్ హిట్ కద సిద్ధం చేసే పనిలో దాదాపుగా రెండేళ్లకు పైగానే గ్యాప్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇప్పుడు సాయి ధరంతేజ్ తో ఒక అదిరిపోయే యాక్షన్స్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట సంపత్. ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్నది ఇంకా నిర్ణయించలేదు. కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న శ్రీ లీలని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని సంపత్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.

 ఇకపోతే సాయి ధరంతేజ్ కి సమంతా అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విడాకుల అనంతరం సమంతా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఎప్పటినుండో సాయి ధరంతేజ్ సమంతతో కలిసి నటించాలని అనుకుంటున్నాడు.అయితే ఆమె ఈ సినిమాకి ఓకే అంటే సమంతతో ఈ సినిమాని చేసే ప్లాన్లో ఉన్నాడట సంపత్. ఇక ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్స్ లిస్ట్ చాలా పెద్దగానే కనిపిస్తుంది. కానీ ఫైనల్ గా మాత్రం ఇద్దరి పేరు ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. దాంతో వీరిద్దరిలో ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు ఫైనల్ అవుతారు అన్నది చూడాల్సి ఉంది .ఇదిలా ఉంటే సంపత్ నంది తన ప్రతి సినిమాలో కూడా తమన్నాని హీరోయిన్గా పెట్టుకుంటాడు. ఇక సాయిధరమ్ తేజ్ కి జోడిగా ఆమెని తీసుకున్న ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: