పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ చివరిగా నటించిన 'రాధే శ్యామ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్స్ లో ఒకటిగా నిలిచింది. కే రాధాకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ప్రభాస్ కి జోడిగా పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. రొమాంటిక్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ మూవీ ని యూవి క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్లో నిర్మించారు. ప్రభాస్ తో పాటు ఈ సినిమాలో కృష్ణంరాజు, సత్యరాజ్, జగపతిబాబు లాంటి సీనియర్ నటీనటులు కూడా నటించారు. 

జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా గత ఏడాది మార్చి నెలలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ ప్లాప్ ని అందుకుంది. అంతేకాదు నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను సైతం మిగిల్చింది. అయితే నిజానికి ఈ సినిమాకి మొదట అనుకున్న హీరో ప్రభాస్ కాదు. ముందు ఈ సినిమా విక్టరీ వెంకటేష్ తో చేయాలని అనుకున్నారట. ఈ విషయం ఇప్పటివరకు చాలామందికి తెలియదు. నిజానికి రాదేశ్యామ్ సినిమాని డైరెక్ట్ చేసింది రాధాకృష్ణనే అయినా.. కథను అందించింది మాత్రం ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి. వాస్తవంగా అయితే చంద్రశేఖరే ఈ సినిమాను తెరకెక్కించాలని ముందు అనుకున్నారట. అంతేకాదు విక్టరీ వెంకటేష్ కు కథను కూడా వినిపించడం జరిగింది.

పామిస్ట్ ఆధారంగా ఉన్న ఈ కథ వెంకిని పెద్దగా ఆకట్టుకోలేక పోయిందట. దాంతో ఆయన సున్నితంగా ఈ సినిమాను రిజెక్ట్ చేశారట. దీంతో చంద్రశేఖర్ ఏలేటి రాధేశ్యామ్ కథను డైరెక్టర్ రాధాకృష్ణకు అమ్మేశారు. అతను ప్రభాస్ దగ్గరికి వెళ్లి కథ చెప్పి ఒప్పించాడు. రాధాకృష్ణ మీద ఉన్న నమ్మకంతో ప్రభాస్ ఈ సినిమాని ఓకే చేశాడు. కానీ తీరా చూస్తే రాధే శ్యామ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని తీవ్రంగా నిరాశపరిచింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ ని అందుకుంది. జూన్ 16న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: