సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేయడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అయితే ఇలా ఒక హీరో రిజెక్ట్ చేసిన స్టోరీ తో సినిమా చేసి మరో హీరో హిట్టు కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అదే సమయంలో ఫ్లాప్ చెవి చూడటం కూడా చాలాసార్లు జరిగింది. అయితే ఇక ఇప్పుడు ప్రభాస్ కూడా సీనియర్ హీరో వెంకటేష్ రిజెక్ట్ చేసిన ఒక సినిమాను చేసి డిజాస్టర్ ఖాతాలో వేసుకున్నాడు అన్నది తెలుస్తుంది.



 ప్రస్తుతం పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ స్టార్ గా కొనసాగుతూ వున్నాడు ప్రభాస్. ఈ క్రమంలోనే వందల కోట్లతో రూపొందుతున్న సినిమాల్లో నటిస్తూ ఉన్నాడు. ఇక ప్రభాస్ సినిమాల కోసం అటు అభిమానులు కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు మరి కొన్ని రోజుల్లో ఆది పురుష్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. అది సరేగాని వెంకటేష్ రిజెక్ట్ చేసిన ప్రభాస్ ఫ్లాప్ మూవీ ఏదో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు కదా.. అదేదో కాదు రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్గా వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.


 యువి క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించగా భారీ తారాగణం కూడా ఉంది. అయితే ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. నిర్మాతలకు బయ్యర్లకు భారీగానే నష్టాలను మిగిల్చింది ఈ సినిమా. అయితే ఈ సినిమాకు మొదటి ఛాయిస్ ప్రభాస్ కాదట. రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన కథను అందించింది మాత్రం చంద్రశేఖర్ ఏలేటి. అయితే చంద్రశేఖర్ ఏలేటి తాను ఈ సినిమాకెక్కించాలని అనుకున్నారట. విక్టరీ వెంకటేష్ కు ఈ కథను వినిపించారట. అయితే పామిస్ట్రీ ఆధారంగా ఉన్న కథ వెంకీకి పెద్దగా నచ్చలేదట.దీంతో ఆయన సున్నితంగా రిజెక్ట్ చేయడంతో చంద్రశేఖర్ రాధాకృష్ణకు కథను  అప్పగించగా.. ఇక ప్రభాస్కు కథ చెప్పి మెప్పించిన రాధాకృష్ణ.. ఇక ప్రేక్షకులను మెప్పించలేక పోయాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: