కొంత కాలం క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , హిందీ , కన్నడ , మలయాళ భాషల్లో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సినిమా పుష్ప పార్ట్ 1. ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించగా నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఫాహధ్ ఫజిల్మూవీ లో విలన్ పాత్రలో నటించగా.... సునీల్ , అనసూయ , రావు రమేష్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ లో ఐటమ్ సాంగ్ లో సమంత నటించింది.

ఈ ఐటెం సాంగ్ ద్వారా సమంత కు సూపర్ క్రేజ్ లభించింది. కెరియర్ లో ఈ సాంగ్ కి ముందు వరకు ఒక్క ఐటమ్ సాంగ్ లో కూడా నటించని సమంత ఈ సాంగ్ తో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకుంది. అలాగే ఈ పాటలో తన అదిరిపోయే ఎక్స్ప్రెషన్స్ తో కూడా ప్రేక్షకులను ఈ నటి అలరించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ఐటమ్ సాంగ్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... పుష్ప పార్ట్ 1 మూవీ లోని ఐటెం సాంగ్ లో మొదటగా సమంత ను మూవీ బృందం అనుకోలేదట.

మొదట ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాలో మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ దిశా పటానీ ని ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో తీసుకోవాలి అని అనుకుందట. కాకపోతే అల్లు అర్జున్ ... సమంత ఐటమ్ సాంగ్ చేస్తే ఈ పాటకు అదిరిపోయే రేంజ్ రీచ్ వస్తుంది అని భావించాడట. అలా అల్లు అర్జున్ ఐడియా మేరకు సమంత ను సంప్రదించగా సమంత ఈ సాంగ్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: