హిందూ సాంప్రదాయం ప్రకారం.. ఎవరికైనా తరచు డబ్బు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అయితే అతని వెంట దురదృష్టం వెంటాడుతోందని గుర్తించాలి.. అతని అలవాట్లు చేసే పనులు కూడా సరిగ్గా ఉండవు..దీనివల్ల ఎల్లప్పుడూ ఎన్నో సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి.. అంతేకాకుండా సనాతన ధర్మం ప్రకారం ఎవరైనా వ్యక్తి ఉదయం లేవగానే తులసి మొక్కను పూజించాలి.. ఈ మొక్కకు నిత్యం పూజలు చేసి సాయంత్రం నీటిని పోసి.. నెయ్యితో దీపం వెలిగిస్తే ఆ వ్యక్తి యొక్క దరిద్రం సైతం తొలగిపోతుందని పండితుల సైతం చెబుతూ ఉన్నారు.


తులసి మొక్కను ప్రతిరోజు పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నరాలై ఆ వ్యక్తికి ఐశ్వర్యం ,సుఖసంతోషాలను చేకూరుస్తుంది. ఆర్థిక ఇబ్బందులలో ఎవరైనా ఉంటే ఆ కష్టాల నుంచి తొలగిస్తుంది.. ఉదయం లేవగానే కచ్చితంగా తులసి చాలీసా ను చదవడం వల్ల ఏవైనా వ్యాధులు దోషాలు కూడా పూర్తిగా న్యాయమవుతాయట.. ఈ చాలీసా ను పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా వీరికి లభిస్తుంది. ఎవరైనా వ్యక్తి జాతకంలో 9 గ్రహాలు చాలా బలహీనంగా ఉంటే తులసి చాలీసాను కచ్చితంగా చదవడం వల్ల ఆ తొమ్మిది గ్రహాలు చాలా శాంతిగా మారుతాయి.


మరి కొంతమంది వివాహం కాక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి వారు కూడా ఈ తులసి చాలీసా ను చదవడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయి. వీరికి పెళ్లి జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయట. తులసి మొక్కలు ఎక్కువగా లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది. అందుచేతనే ప్రతిరోజు తులసి మొక్కను ఉదయం లేవగానే మొక్కడం వల్ల లక్ష్మీ మాత ప్రసన్నరాలై వారి యొక్క కోరికలను సైతం తీరుస్తుందని పురాణాలలో తెలియజేయడం జరిగింది. తులసి మొక్కకు క్రమం తప్పకుండా నీటిని పోస్తే వారి యొక్క సమస్యలు కూడా తొలగిపోతాయి. దీనివల్ల ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఆదివారం రోజున తులసి మొక్కను అసలు ముట్టుకోకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: