బాలీవుడ్‌ హీరో సైఫ్‌ ఆలీ ఖాన్‌కు, మొదటి భార్య అమృతా సింగ్‌కు పుట్టిన కూతురు సారా అలీ ఖాన్  కోర్టు మెట్లేక్కనున్నారు. ‘కేదర్‌నాథ్‌’ సినిమా డేట్స్‌ విషయంలో గొడవలు రావడంతో సదరు చిత్ర యూనిట్‌ సారా మీద కోర్టులో దావా వేసింది. సారా తమ చిత్రానికి పనిచేసేందుకు ఒప్పుకుని ఆ తర్వాత మొహం చాటేసిందంటూ ఓ నిర్మాత కోర్టుకెక్కాడు. తీరా సారాని నమ్ముకుని తాము చిత్రాన్ని మొదలుపెట్టిన తర్వాత, ఆమె వేరే చిత్రంలో బిజీగా ఉన్నానని తప్పించుకుంటోందని ఆరోపించాడు.
Image result for సారా అలీ ఖాన్ కోర్టు
ముంబై హైకోర్టు నేడు(శుక్రవారం) ఈ విషయాన్ని విచారించనుండటంతో సారా, తండ్రి సైఫ్‌ అలీఖాన్‌తో కలిసి కోర్టుకు హజరవ్వనున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే... సారా అలీఖాన్‌ కేదార్‌నాథ్‌ సినిమా ద్వారా బాలీవుడ్‌కు పరిచయమవ్వాల్సిందన్న విషయం తెలిసిందే. అభిషేక్‌ కపూర్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రం కోసం 2018 జూన్‌ వరకూ సారా డేట్స్‌ ఇచ్చారు.అయితే నిర్మాతకు, దర్శకుడికి మధ్య వివాదాలు రావడంతో ఈ సినిమా నిర్మాణం ఆగిపోయింది.
Image result for సారా అలీ ఖాన్ కోర్టు
దాంతో సారా, రోహిత్‌ శెట్టి తెరెక్కిస్తున్న ‘సింబా’(టెంపర్‌ రీమేక్‌) సినిమా కోసం డేట్లు అడ్జస్ట్‌ చేశారు. అదే సమయంలో మరో నిర్మాత దొరకటంతో అటకెక్కిందనుకున్న కేదార్‌నాథ్‌ షూటింగ్‌ తిరిగి ప్రారంభం అయ్యింది. దాంతో షూటింగ్ మళ్లీ మొదలు అయ్యిందని..షూటింగ్ కి రావాల్సిందిగా సారాను అడిగారు చిత్ర యూనిట్. కానీ ఆమె మేనేజర్‌ మాత్రం సింబా షూటింగ్‌ పూర్తయ్యాకే కేదర్‌నాథ్‌ చిత్రీకరణలో పాల్గొంటారని తేల్చి చెప్పారు.
Related image
అయితే ఎన్ని సార్లు రిక్వెస్ట్ చేసినా సారా మాత్రం షూటింగ్ లో పాల్గొనే పరిస్థితిలో లేనని సమాధానం చెబుతూ వచ్చింది. దాంతో చిర్రెత్తుకొచ్చిన  కేథరినాధ్ ఫిలిమ్ మేకర్లు సారాపై దావా వేశారు. అయితే ఈ విషయాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవాలని సారా తండ్రి సైఫ్ అలీఖాన్ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: