మహేష్ నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో ‘దూకుడు’ సెంటిమెంట్ ‘ఆగడు’ కామెడీ కలిసి ఉంటాయని ఇప్పటివరకు లీకులు వచ్చాయి. అయితే ఇప్పుడు దీనికి భిన్నంగా ఈ సినిమాకు సంబంధించి ఒక షాకింగ్ లీక్ బయటకు వచ్చింది. 

ప్రస్తుతం హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీలో మేజర్ పాత్రను చేస్తున్న మహేష్ అజయ్ కృష్ణ అనే క్యారెక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆర్మీలో తన మిత్రుడు చనిపోవడంతో అతని స్థానంలో పేరు మార్చుకొని విజయశాంతిని కలుస్తాడట. దీనితో అతడులో మహేష్ రాజీవ్ కనకాల పేరుతో పార్ధుగా వచ్చినట్లు కొన్ని సీన్స్ ‘సరిలేరు నీకెవ్వరు’ లో ఉంటాయని లీకులు వస్తున్నాయి.

ఈ మూవీలో విజయశాంతి రాయలసీమ ప్రాంతానికి చెందిన  రాజకీయ నాయకురాలుగా కనిపించబోతోంది. అయితే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు విజయశాంతికి అతను ఏమవుతాడు అన్న విషయం ప్రస్తుతానికి సస్పెన్స్ గా కొనసాగుతోంది. దీనితో మహేష్ గతంలో నటించిన ‘దూకుడు’ ఆగడు’ ‘అతడు’ సినిమాలు కలిపి ‘సరిలేరు నీకెవ్వరు’ లో చూడబోతున్నామా అంటూ మహేష్ అభిమానులు భయపడిపోతున్నారు. 

వాస్తవానికి ఈ లీకులు ఎందుకు వచ్చాయో తెలియడం లేదు అయితే దర్శకుడు అనీల్ రావిపూడి ఈ మూవీని అత్యంత భారీ హిట్ గా చేయడానికి చేస్తున్న ప్రయత్నాలలో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడిందా అన్న సందేహాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి దసరాకి ఒక షాక్ ఉంటుందని అంటున్నారు. బహుశా ఈ మూవీ మేకింగ్ టీజర్ ను కాని లేదంటే ఒక సాంగ్ వీడియోను కానీ విడుదల చేసే అవకాసం ఉంది అనిటాక్. ఈ మూవీలో బండ్ల గణేష్ హైలెట్ గా ఉండటమే కాకుండా దర్శకుడు అనీల్ రావిపూడి కామెడీ టచ్ ప్రతి సీన్ లో కనిపిస్తూ ప్రేక్షకులను తెగ నవ్విస్తుందని అంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: