విజయశాంతి చిరంజీవిలు కలిసి సుమారు 19 సినిమాలలో నటించినా వారిద్దరి మధ్య గ్యాప్ ఉంది అన్నవిషయం ఓపెన్ సీక్రెట్. ముఖ్యంగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికలలో పోటీ చేస్తున్నప్పుడు విజయ్ శాంతి చిరంజీవిని టార్గెట్ చేస్తూ అనేక సంచలన వ్యాఖ్యలు చేసింది. 

అప్పట్లో మీడియాకు విజయశాంతి చిరంజీవి పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్. ఆ తరువాత ఏ సందర్భంలోనూ ఓపెన్ గా విజయశాంతి చిరంజీవి ఒకే వేదిక పై కలిసే సందర్భాలు రాలేదు. దీనితో నిన్న జరిగిన ‘సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ లో చిరంజీవి విజయశాంతి పై అభిమానం చూపెడుతూ ఎదోవిధంగా గతంలో ఆమె తన పై చేసిన తీవ్ర విమర్శలకు ఓపెన్ గా సారి చెప్పిద్దామని చాల ప్రయత్నాలు చేసాడు.

తన పై అంత ఘోరమైన నెగిటివ్ కామెంట్స్ చేయడానికి మనసు ఎలా వచ్చింది అంటూ చిరంజీవి ఓపెన్ గానే విజయశాంతిని అడిగినా ఆమె నవ్వుతూ ఊరుకుంది కాని సారీ చెప్పలేదు. అయితే చిరంజీవి మళ్ళీమళ్ళీ అదే విధంగా ప్రయత్నిస్తూ ఉండటంతో రాజకీయాలు వేరు సినిమాలు వేరు అంటూ చిరంజీవి అంటే ఇష్టం లేకపోతే అతడితో కలిసి 19 సినిమాలు ఎలా చేస్తాను అంటూ ఏకంగా మెగా స్టార్ కే ఎదురు ప్రశ్నలు వేసింది. ‘నా హీరో’ అంటూ ‘నా హీరోయిన్’ అంటూ విజయశాంతి ఒకరి పై ఒకరు ‘సరిలేరు నీకెవ్వరు’ వేదిక సాక్షిగా ప్రేమను కురిపించుకున్నా పాత విషయాలను గుర్తుకు చేసేలా చేసింది. 

అందుకే చిరంజీవి నిన్నటి ఈవెంట్ లో ఎమోషనల్ గా మాట్లాడుతూ సినిమాలు ఇద్దరి వ్యక్తుల స్నేహాన్ని పెంచితే రాజకీయాలు ఇద్దరి వ్యక్తుల మధ్య పగను దూరాన్ని పెంచుతుంది అంటూ తాను రాజకీయాలలోకి వచ్చిన తరువాత తెలిసింది అంటూ భావయుక్తంగా కామెంట్ చేసాడు. ఇదే వేదిక పై చిరంజీవి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ తాను రాజకీయాలలో చిరంజీవి కన్నా సీనియర్ అని సమాధానం చెపుతూ ఆమె గతంలో పెట్టిన ‘తల్లి తెలంగాణ’ పార్టీ విషయాలను పరోక్షంగా గుర్తు చేయడంతో ఆమె యాటిట్యూడ్ ఇంకా ఏమి తగ్గలేదు అన్న విషయం మరొకసారి స్పష్టం అయింది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: