తెలుగు ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆ కాంబినేషన్ లో చిత్రాలు అంటే వాటికి ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడుతుంటాయి.  అలాంటి కాంబినేషన్ లోకి వస్తారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ - అల్లు అర్జున్.  వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.  ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం మ్యూజికల్ గా ఓ మాయ చేసిందనే చెప్పాలి.  సామ జవరగమనా, రాములో రాములా, బుట్టబొమ్మా ఈ మూడు సాంగ్స్ ఇప్పటికీ ప్రతిచోట మారుమోగుతూనే ఉన్నాయి. ఈ చిత్రం విడుదలయ్యాక ఎన్ని రికార్డులను కొల్లగొట్టిందో మనం చూసాం.

 

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటిదాకా ఉన్న రికార్డులు అన్నీ ఈ చిత్రంతో తుడిచిపెట్టుకుపోయాయి. బాహుబలి 2 తప్పించి ఇక్కడ, ఓవర్సీస్ లో అన్ని రికార్డులను ఈ చిత్రం కొల్లగొట్టింది.  ఇందులో ఎలాంటి గ్రాఫిక్స్ మాయాజాలాలు లేవు..  ఓ తండ్రి తన స్వార్థానికి పోతే.. ఆ కష్టం మరో కుమారుడికి కలుగుతుంది... ఇదే మూవీ కాన్సెప్ట్.  తండ్రిగా మురళీ శర్మ, కొడుకుగా అల్లు అర్జున్ మద్య సంఘర్షణ ఈ చిత్రానికి హైలెట్ గా నిలిిచంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ శైలి గురించి మనందరికీ తెలుసు. హీరోలను, హీరోయిన్లను రిపీట్ చేయడం త్రివిక్రమ్ కు ఉన్న అలవాటు. మహేష్ తో రెండు సార్లు, పవన్ తో మూడు సార్లు, బన్నీతో మూడు సార్లు పనిచేసిన త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో రెండోసారి పనిచేయబోతున్నాడు. 

 

ఆ మద్య ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో త్రివిక్రమ్ మాట్లాడుతూ.. మంచి కథ అనిపిస్తే అల్లు అర్జున్ తో ఎన్ని సార్లు అయినా చిత్రాలు తీయడానికి తాను రెడీగా ఉన్నానని అన్నారు.. దానికి ఈ హీరో కూడా నేను కూడా రెడీ అని చెప్పారు.  ఈ నేపథ్యంలో ఇప్పుడు వీరి కాంబినేషన్ లో నాలుగో చిత్రం కోసం అప్పుడే కథ రెడీ చెసుకున్నట్లు సమాచారం.  ప్రస్తుతం ఇద్దరూ షూటింగ్ బిజీలో ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ ఇద్దరూ దాదాపు ఒకే సమయానికి ఫ్రీ అవుతారు కాబట్టి వారి కాంబినేషన్ లో చిత్రం ఉంటుందని భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: