కరోనా... ఈ పేరు వినగానే ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.. భారత్ లో ఇప్పటికే పలు పాజిటివ్ కేసులు నమోదు అయినా సంగతి తెలిసిందే..అయితే ఇటీవల భారత్ లో కూడా వ్యాపించిన ఈ కరోనా ప్రజలు భపడుతున్నారు. కరోనా వైరస్ ఎలా వస్తుంది అనేది తెలియకుండా ప్రజలు బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారు. ఇప్పటికే కొందరు సెలెబ్రెటీలు ఈ కరోనా వైరస్ వ్యాప్తిపై పలు విధాల జాగ్రత్తలు చెబుతూ వస్తున్నారు..సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
ఈ క్రమంలో కొనేదల ఉపాసన, విజయ్ దేవరకొండ, అమితాబ్ బచ్చన్ లు కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియ జేశారు.. చేతుల ద్వారా ఎటువంటి రోగమైన కూడా తొందరగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఈ వ్యాధిని అరికట్టాలంటే ముందుగా చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి.. అలాగే జలుబు దగ్గు లాంటివి ఉన్న వాళ్లకు దూరంగా ఉండాలని సూచించారు.. తినే ఆహార పదార్థాలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తున్నారు.
అయితే కరోనా ప్రభావం వల్ల బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈరోజు అభిమానులు ఎవరూ తన ఇంటికి రావద్దని కోరారు. ప్రతివారం ఆదివారం తన ఇంటికి వచ్చే అభిమానులతో కాసేపు ముచ్చట్లాడడం అమితాబచ్చన్ అలవాటు. ఈ సందర్భంగా అభిమానులందరినీ ఆప్యాయంగా పలకరిస్తుంటారు.
అయితే దేశవ్యాప్తంగా కరోనా ప్రమాదం నేపథ్యంలో ఈ వారం దీన్ని రద్దు చేసుకున్నట్లు ఆయన ప్రకటించారు. అందువల్ల అభిమానులు దీన్ని గుర్తించి తన ఇంటికి రావద్దని కోరారు.ఈ విషయాన్ని స్వయంగా అమితాబచ్చన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో ఆయన అభిమానులు షాక్ కు గురయ్యారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గే వరకు అభిమానులను కలవమని చెప్పినట్లు సమాచారం. మొత్తానికి సినీ ఇండస్ట్రీని కరోనా బాగా పట్టీ పీడిస్తుందని అర్థమవుతుంది.
T 3470 - To all Ef and well wishers an earnest request !PLEASE DO NOT COME TO jalsa GATE TODAY .. sunday MEET am not going to come !
— amitabh bachchan (@SrBachchan) March 15, 2020
Take PRECAUTIONS .. be safe
Sunday का दर्शन jalsa पे cancel है , कृपया कोई वहाँ जमा ना हों आज श्याम को ।
सुरक्षित रहें🙏🙏🙏 pic.twitter.com/USm4kZBEYo