మాస్ రాజా రేంజ్ చూపిస్తున్నాడు. కాంప్రమైజ్ అయ్యే సమస్యే లేదంటున్నాడు. ఈ మధ్య రవితేజ కాస్ట్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. కానీ ఈ స్టార్ హీరో మాత్రం ఆ విషయాన్ని లైట్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. దర్శక నిర్మాతలు కాస్త ఆలోచించాలని చెప్పిన మాస్ రాజా మాత్రం బెట్టు వీడటం లేదని టాక్. 

 

వరుస ఫ్లాపులతో రవితేజ సక్సెస్ రేసులో వెనుకబడ్డాడు. రాజా ది గ్రేట్ సినిమా తర్వాత ఈ స్టార్ కు హీరో మరో హిట్ లేదు. హిట్ కోసం దర్శకులను మార్చి మార్చి ప్రయోగాలు చేస్తున్న ఈ మాస్ హీరోకు బాక్సాఫీస్ దగ్గర కలిసి రావడం లేదు. వరుస ఫ్లాప్స్ తో రవితేజ మార్కెట్ ఢీలా పడింది. లాస్ట్ మూవీ డిస్కో రాజా కేవలం తొమ్మిది కోట్లే కలెక్ట్ చేసిందంటే రవితేజ క్రేజ్ ఎలా పడిపోతోందో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ మాస్ రాజాలో అసలు మార్పు లేదని టాక్. 

 

ప్రస్తుతం రవితేజ మలినేని గోపీచంద్ దర్శకత్వంలో క్రాక్ మూవీలో నటిస్తున్నాడు. గతంలో ఈ కాంబినేషన్ లో వచ్చిన డాన్ శీను, బలుపు చిత్రాలు హిట్స్ గా నిలిచాయి. దీంతో క్రాక్ రవితేజకు హిట్ ఇస్తోందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అలాగే బలుపుతో రవితేజకు జోడీగా నటించిన శృతిహాసన్ క్రాక్ లో మరోసారి జోడీ కట్టనుంది. ఈ సినిమా తర్వాత రమేశ్ వర్మ దర్శకత్వంలో కిలాడీ అనే మూవీలో నటించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. 

 

రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న కిలాడీ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నాడు.  ఈ సినిమా కోసం మాస్ రాజా రవితేజ 12కోట్ల పారితోషికం తీసుకున్నాడట. సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నా.. తన మార్కెట్ పడిపోతున్న రవితేజ మాత్రం బెట్టు వీడటం లేదట. మాస్ రాజా రెమ్యునరేషన్ ఎఫెక్ట్ బడ్జెట్ పై పడుతోందని నిర్మాతలు రిక్వెస్ట్ చేస్తున్నా వినడం లేదని టాక్. సక్సెస్ రేట్ పట్టించుకోకుండా రవితేజ ఇలాగే చేస్తే తన కెరీరే ఇరకాటంలో పడుతోందంటున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: