భారత్ లో  రోజురోజుకు కరోనా వైరస్ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కరోనా  వైరస్ ప్రభావం నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్  ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అన్ని రంగాల్లో ఒక్కసారిగా మూతపడ్డాయి. ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇక ఈ క్రమంలోనే సినీ పరిశ్రమ కూడా పూర్తిగా మూత పడింది అనే చెప్పాలి. షూటింగ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. స్టార్ హీరోల సినిమాల నుంచి సినిమా హీరోల సినిమాలు అనే తేడా లేకుండా... భారత చిత్ర పరిశ్రమ మొత్తం షట్ డౌన్ అయిపోయింది. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు అందరూ కేవలం ఇంటికే పరిమితమై హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు. 

 

 అయితే సిని  సెలబ్రిటీలు లాక్ డౌన్ నేపథ్యంలో కేవలం ఇంట్లో ఉండి సైలెంట్ గా  కూర్చోవడమే కాదు సరికొత్తగా ఏదో ఒకటి ఇంట్లో ట్రై చేస్తూ అభిమానులను అలరిస్తూనే  ఉన్నారు. మొన్నటికి మొన్న శిఖర్ ధావన్ ఏకంగా ఇంట్లో అంట్లు తోముతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇంకా ఎంతో మంది స్టార్స్ కూడా వంటగదిలో తెగ కాలం గడిపేస్తూ ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు. లాక్ డౌన్  నేపథ్యంలో షూటింగ్ లకు  పూర్తిగా విరామం ఇచ్చి ఇంటికి పరిమితమైన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకొనే కూడా... వంటగదికి కాస్త సమయాన్ని కేటాయిస్తున్నారు. లాక్ డౌన్ సమయాన్ని ఉపయోగించుకుంటూ వంట నేర్చుకునే  ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

 

 ఈ క్రమంలోనే దీపికా పదుకొనే తన వంటగదిలో ఉన్న పప్పుధాన్యాలు ఇతర నిత్యావసర వస్తువులను సర్దుకున్నారు. లేబుల్ ప్రింటింగ్ మిషన్ సహాయంతో... వంటగదిలోని వివిధ పదార్థాలు సరుకులకు వాటి వాటి పేర్లతో కూడిన ట్యాగ్లను ఆయా బాక్స్ లకు అతికించారు. వంటగదిలో ఉండే వివిధ పదార్థాలు సరుకులను సరిగ్గా సర్దుతూ ఈ ట్యాగ్ లను అతికించారు దీపికాపదుకొనె. అయితే లాక్ డౌన్ సమయంలో దొరికిన టైం మొత్తం వంటగదిని సర్దుకునేందుకు  వంట చేసేందుకు ఉపయోగించాను అంటూ దీపికా పడుకొని తన ఇస్టాగ్రామ్ లో ఓ  పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: