శ్రీదేవి కూతురు జాన్వీ అదిగో.. తెలుగులో సినిమా చేసేస్తోంది. ఇదిగో తమిళంలో దుల్కర్ పక్కన నటిస్తోందంటూ వార్తలు వచ్చాయే గానీ.. ఒక్కటీ నిజం కాలేదు. ఆ మధ్య విజయ్ దేవరకొండతో జత కడుతోంది. లేటెస్ట్ గా ఎన్టీఆర్ పక్కన నటిస్తోందంటూ.. వచ్చిన న్యూస్ ఎందుకు నిజం కాలేదు. జాన్వీ కపూర్ కు సౌత్ ఇండియా మూవీ చేయడం ఇష్టం లేదా.. లేదంటే వేరే కారణం ఏమైనా ఉందా.

 

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఎవరంటే.. దీపికా పదుకొనే.. ప్రియాంక.. కత్రినా .. అలియా పేరు చెబుతారు. నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే.. దీపిక.. కత్రిన మధ్య కాంపిటీషన్ నడుస్తుందంటారు. అయితే అనుకోకుండా.. జాన్వీ కపూర్ టాప్ ప్లేస్ ఆక్రమించేసింది. ఏ స్టార్ హీరోయిన్ కూ లేనన్ని సినిమాలు జాన్వీ చేసేస్తోంది. ఎక్కువ సినిమాలు చేసే హీరోయిన్స్ లో జాన్వీదే టాప్ పొజిషన్. 

 

దఢక్ మూవీతో హీరోయిన్ గా పరిచయమైన జాన్వీ ప్రస్తుతం తక్త్ సినిమాతో పాటు.. లేడీ ఓరియెంటెడ్ మూవీ గుంజాన్ సక్సేనాలో చేస్తోంది. కార్గిల్ యుద్ధం సమయంలో గాయపడిన సైనికులను సురక్షిత ప్రదేశానికి తీసుకొచ్చిన పైలట్ గుంజాన్ సక్సేనా బయోపిక్ ఇది. మరో రెండు సినిమాలు దోస్తానా 2.. ఘోస్ట్ స్టోరీస్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. 

 

జాన్వీ నటించే అరడజను సినిమాల్లో తండ్రి బోనీ కపూర్ నిర్మించే సినిమా కూడా ఉంది. బాంబే గర్ల్ సినిమాను బోనీ కపూర్ నిర్మించనున్నాడు. రూహి ఆప్జా పేరుతో రూపొందే చిత్రంలో జాన్వీ డ్యూయెల్ రోల్ పోషించనుంది. ఇలా బాలీవుడ్ లో ఏ హీరోయిన్ కూ లేనన్ని సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీ అయిపోయింది జాన్వి. శ్రీదేవి అభిమానులు జాన్వీ తెలుగు ఎంట్రీ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నా.. ఫలితం లేదు. ఇత బిజీ షెడ్యూల్లో తెలుగులో నటించే అవకాశం లేదని తేలిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: