పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత చేస్తున్న సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ లో సూపర్ హిట్టైన పింక్ మూవీ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా.. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ లాయర్ గా కనిపించనున్నారు. ఆల్రెడీ ఈ సినిమాను తమిళంలో అజిత్ రీమేక్ చేశారు. అసలైతే మే నెలలో రిలీజ్ చేసేలా ఈ సినిమా షెడ్యూల్ ప్లాన్ చేయగా కరోనా ప్రభావంతో లాక్ డౌన్ నడుస్తున్నందు వల్ల రిలీజ్ డేట్ వాయిదా పెద్దది. పవన్ ను మొదటిసారి డైరెక్ట్ చేస్తున్న వేణు శ్రీరామ్ పవన్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. 

 

ఊరకనే ఎవరు పవర్ స్టార్లు.. ఆయన డెడికేషన్ సూపర్ తినేస్తున్నాడు డైరక్టర్ వేణు శ్రీరామ్. ప్రతిరోజూ పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ చేస్తూనే విజయవాడ వెళ్లి వచ్చేవారని అన్నారు. ఉదయం విజయవాడ వెళ్లొచ్చి.. సాయంత్రం సినిమా షూటింగ్ లో పాల్గొనే వారట. ఆయనకు ఉన్న కంటిమెంట్లు అన్నిటిని పూర్తి చేయాలని పవన్ చాలా బిజీగా ఉంటారని. సినిమా కోసం ఆయన చూపిస్తున్న డెడికేషన్ చూసి తనకు ఆశ్చర్యం వేసిందని అన్నారు వేణు శ్రీరామ్. 

 

రీమేక్ సినిమానే అయినా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కావాల్సిన కమర్షియల్ అంశాలకు లోటు లేకుండా చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే షూటింగ్ ముగింపు దశకు రాగా లాక్ డౌన్ ఎత్తేసి షూటింగ్స్ చేసుకోవచ్చని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు మిగతా టాకీ పార్ట్ పూర్తి చేసి రిలీజ్ డేట్ ప్రకటిస్తారా. ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ నటిస్తుందని తెలుస్తుంది. అయితే వకీల్ సాబ్ లో శృతి హాసన్ లేదన్నట్టు వార్తలకు కూడా చెక్ పెట్టాడు డైరక్టర్ వేణు శ్రీరామ్.         

మరింత సమాచారం తెలుసుకోండి: