ప్రేమ.. పెళ్లి.. రీఎంట్రీ. హీరోయిన్స్ విషయంలో ఇవి కామన్. జెనీలియా కూడా అందరిలాగానే.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేద్దామనుకుంటే.. ఇద్దరు అడ్డుపడుతున్నారు. అలాగని భర్త రితేశ్ దేశ్ ముఖ్ మాత్రం కాదు. మళ్లీ నటించాలని ఉందంటే.. గ్రీన్ ఇచ్చాడు. భర్త పచ్చజెండా ఊపినా.. జెనీలియా ఎందుకు నటించలేకపోతోంది. 

 

జెనీలియా తెలుగులో తన పేరుతో కంటే.. హాసినిగానే ఎక్కువ పాపులర్ అయింది. ఒకే సంవత్సరం 2003లో హిందీతో పాటు.. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ మొదట్లో హిట్స్ తో లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. బొమ్మరిల్లు సినిమాతో హాసినిగా తెలుగు వారికి బాగా దగ్గరైంది జెనీలియా. 

 

వెంకటేశ్ లాంటి సీనియర్ హీరోతో పాటు.. ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ లాంటి స్టార్స్ తో నటించిన జెనీలియా 2012లో రితేష్ దేశ్ ముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తెలుగులో చివరిగా నటించిన చిత్రం నా ఇష్టం. సినిమాలకు గుడ్ బై చెప్పేసిన జెనీలియా.. ఆ మధ్య మళ్లీ నటిస్తున్నట్టు పేర్కొంది. జై హో.. ఫోర్స్ 2లో గెస్ట్ రోల్ పోషించిన జెనీలియా.. ఫుల్ ప్లెజ్డ్ రోల్ చేయాలని అనుకున్నా.. నటించకపోవడానికి కారణం పిల్లలేనని తేల్చి చెప్పేసింది. 

 

లాక్ డౌన్ సమయంలో జెనీలియా టిక్ టాక్ ద్వారా డైన్ విత్ మీ అంటూ ఫ్యాన్స్ తో లైవ్ చిట్ చాట్ చేసింది. ఈ లైవ్ ఓపెన్ ద్వారా తన అనుభవాలను పంచుకుంది. తనకు సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలని ఉందని.. కానీ తన ఇద్దరు పిల్లలు ఇంకా చాలా చిన్నవారు కావడం వలన రీఎంట్రీ ఇచ్చే సాహసం చేయలేకపోతున్నానని చెప్పింది. 

 

పిల్లల ఆలనాపాలనా చూసుకోవడానికి ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశ్యంతో సినిమాల్లో రీఎంట్రీ లేట్ అవుతోందని చెప్పుకొచ్చింది. తన భర్త రితేష్ తో కలిసి మరాఠీ సినిమాలో చేయాలని ఉందని తెలిపింది. ఏది ఏమైనా రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ ఉందని క్లారిటీ ఇచ్చింది జెనీలియా. 

మరింత సమాచారం తెలుసుకోండి: