కొన్నిరోజుల క్రితం బాలకృష్ణ షూటింగ్ ల పునఃప్రారంభం విషయంలో చిరంజీవి ఆద్వర్యంలో జరిగిన మీటింగ్ లకు తనను పిలవనందుకు తన అసహనాన్ని చాల ఓపెన్ గానే తెలియచేసారు. దీనితో తిరిగి బాలకృష్ణ చిరంజీవిల మధ్య ఓపెన్ రగడ మరింత పెరుగుతుందని కొందరు సందేహాలు వ్యక్త పరిచారు.


ఆతరువాత బాలకృష్ణ తన మాటలలో వేడిని తగ్గించి తాను ఎవరినీ ఓపెన్ గా టార్గెట్ చేయడంలేదు అని అనడంతో బాలయ్య తన ఉగ్ర స్వరూపాన్ని తగ్గించుకుని వెనుకడుగు వేసాడు అన్న కామెంట్స్ కూడ వచ్చాయి. చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తూ అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో రాయబారాలు చేసి షూటింగ్ ల పునఃప్రారంభం విషయంలో అనుమతులు తీసుకు రావడంలో విజయం సాధించాడు.


అయితే బాలకృష్ణ మాత్రం ముందునుంచి ప్రస్తుత పరిస్థితులలో షూటింగ్ లు చేయడం అసాధ్యం అని అంటూ తన అభిప్రాయాన్ని ముందునుంచి ఒకే విధంగా కొనసాగించాడు. షూటింగ్ లు ప్రారంభించే విషయంలో అనుమతులు వచ్చే వరకు హడావిడి చేసిన చిరంజీవి తన అభిప్రాయాన్ని మార్చుకుని ఇప్పుడు ఈ కరోనా సమస్యలు కొంతవరకు కంట్రోల్ అయ్యాక తన ‘ఆచార్య’ షూటింగ్ లు మొదలు పెడదాము అన్న అభిప్రాయానికి వచ్చేసాడు.


ఇప్పుడు ఈ రెండు విషయాలను పోలుస్తూ బాలయ్య అభిమానులు కొన్ని రకాల కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవిలా బాలకృష్ణ తన అభిప్రాయాలను రోజుకు ఒక విధంగా మార్చుకోడనీ బాలయ్య ఒక నిర్ణయానికి వస్తే ఆ నిర్ణయం కోసం నష్టాన్ని అయినా భరిస్తాడు అంటూ బాలయ్య అభిమానులు చిరంజీవి ‘ఆచార్య’ షూటింగ్ విషయంలో వెనకడుగు వేస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మెగా స్టార్ ను ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు బాలయ్య  అభిమానుల కామెంట్స్ లో వేడి పెరుగుతున్న పరిస్థితులలో వీటికి సరైన సమాధానం ఇచ్చే ఆలోచనలలో చిరంజీవి అభిమానులు ఉన్నట్లు టాక్..

 

మరింత సమాచారం తెలుసుకోండి: