టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లు అనగానే గుర్తొచ్చే పేర్లలో ఈషా రెబ్బ కూడా ఒకరు. అంతకు ముందు ఆ తర్వాత చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ అచ్చ తెలుగమ్మాయి బందిపోటు, అమీ తుమి వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం అమ్మడు అవకాశాలు అందుకోలేక పోయింది. అందం అభినయం, అందులోనూ తెలుగు అమ్మాయి  అయి ఉండడంతో పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్స్, గ్లామర్ కి గ్లామర్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ ఈ ముద్దు గుమ్మకు తెలుగులో హీరోయిన్ గా ఆఫర్లు మాత్రం పెద్దగా రావడం లేదు. దాంతో ఓ వైపు వెబ్ సిరీస్ లోను మరో వైపు తన లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అభిమానుల సంఖ్యను పెంచుకుంటూ బాగానే క్రేజ్ తెచ్చుకుంది. 

ప్రస్తుతం అఖిల్‌ లేటెస్ట్ ఫిలిం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’  సినిమాలోనూ ఓ కీలక పాత్ర చేస్తుంది. అయితే ఇటీవలే మలయాళ ఇండస్ట్రీలో ఓ చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. మలయాళ దర్శకుడు ఫెల్లి  డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడగా, ఈ సినిమాలో తన పాత్ర కోసం భారీగా వర్కౌట్ చేస్తోందట ఈషా. రైఫిల్ షూటింగ్, బాక్సింగ్‌లో ట్రైనింగ్‌ తీసుకుంటూ తన పాత్రపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఒక సినిమా కోసం విన్యాసాల పేరుతో ఇలా కష్టాలు పడుతోంది ఈషా రెబ్బ. ఈ చిత్రంతో అక్కడ సక్సెస్ అందుకుని తన క్రేజ్ ను డబుల్ చేసుకునే ఆలోచనతో ఈషా  ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా మలయాళంతో పాటు తమిళంలో కూడా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. సీనియర్ హీరో, ప్రముఖ నటుడు అరవింద స్వామి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనుండడం విశేషం. మరి ఇక్కడ అయినా తనకు అదృష్టం వరించి కొంతకాలం హీరోయిన్ గా కొనసాగుతుందా అనేది చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: