ఆయన ఎవరో కాదు ప్రముఖ సినీ రచయితగా దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన పరుచూరి గోపాలకృష్ణ. తన ఏదైనా కథ విన్నప్పుడు ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అవుతుందా..? లేక ఫ్లాప్ అవుతుందా..? అనే విషయాలను రెప్పపాటు సమయంలో చెప్పేస్తారట. అంతలా ఆయనకు సినీ ఇండస్ట్రీలో అనుభవం ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఇటీవల విడుదలైన నారప్ప సినిమా చూసిన పరుచూరి , దగ్గుబాటి ఫ్యామిలీ తో ఉన్న బంధాలను పరుచూరి పలుకులు అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలపడం జరిగింది.
అంతేకాదు రామానాయుడు, వెంకటేష్ , సురేష్ బాబు, రాణాతో ఆయనకున్న అనుబంధం గురించి ఆయన తెలిపాడు. ముఖ్యంగా పరుచూరి కి నారప్ప సినిమా చూడగానే దగ్గుబాటి ఫ్యామిలీ అంతా కళ్ల ముందు ప్రత్యక్షం అయిందట.. ఈయన చెప్పిన మాట ఏమిటంటే ..ఎన్టీఆర్ ను ఫాదర్ గా భావిస్తే, రామానాయుడు గాడ్ ఫాదర్ గా అప్పట్లో సినీ ప్రముఖులు భావించే వారట.. అంటే కాదు రామానాయుడు గనుక వెంకటేష్ నటించిన నారప్ప సినిమా కనుక చూసి ఉంటే, వెంకటేష్ నటనను చూసి ఎంతో పులకించిపోయేవారు అని కూడా పరుచూరి తెలపడం జరిగింది.
ఇక పరుచూరి ని ప్రపంచంలోనే ఒక మంచి జడ్జి అని చెప్పవచ్చు.. ఒకానొక సమయంలో ఆయన "ప్రతిధ్వని" సినిమా కథ విన్నప్పుడు కేవలం ఎనిమిది నిమిషాలు మాత్రమే విన్నారట. తప్పకుండా ఈ సినిమా ఆడుతుంది అని చెప్పడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.. అందుకే చాలామంది దర్శక నిర్మాతలు ముందు పరుచూరి దగ్గర కథ వినిపించి, ఆ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందో తెలుసుకొని మరి నిర్మిస్తారన్న టాక్ అప్పట్లో ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి