టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే.ఇక ఆయన పుట్టినరోజు సందర్భంగా వరుస అప్డేట్స్ తో తన ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేసాడు మహేష్.అయితే తాజాగా మహేష్ బాబు ఫ్యాన్స్ కొంతమంది ట్విట్టర్ స్పెస్ నిర్వహించగా..అందులో పలువురు టాలీవుడ్ అగ్ర దర్శకులు పాల్గొన్నారు.ఈ క్రమంలో మహేష్ బాబు గురించి గొప్పగా చెప్పడంతో పాటూ ఆయనతో సినిమాలు ఎప్పుడు చేయబోతున్నారో వెల్లడించారు.ఈ నేపథ్యంలో చాలాకాలంగా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మహేష్ బాబు తో సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.కానీ ఇప్పటి వరకు వీరి కాంబినేషన్ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు.

అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చాడు సందీప్.ఇటీవలే తాను మహేష్ బాబు కి కథ చెప్పానని..సరైన సమయం వచ్చినప్పుడు ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవుతుందని చెప్పుకొచ్చారు.అలాగే మరో దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా మహేష్ తో తాను చేయబోయే సినిమా గురించి మాట్లాడారు.'మహర్షి' సినిమా తర్వాతమహేష్ బాబు తో మరో సినిమా చేయాలని అనుకున్నారు వంశీ పైడిపల్లి.కానీ ఎందుకనో అది కుదరలేదు.అయితే మహేష్ తో సినిమా మాత్రం కచ్చితంగా ఉంటుందని..అంతేకాదు ఎవ్వరూ ఊహించని రీతిలో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు వంశీ పైడిపల్లి చెప్పాడు.

మరి మొత్తానికి ఈ ఇద్దరు స్టార్ డైరెక్టర్లు మహేష్ తో సినిమా తీయాలని ఎప్పట్నుంచో కంటున్న కలలు త్వరలోనే నిజం కాబోతున్నాయన్నమాట. ఇక ప్రస్తుతం మహేష్ నటిస్తున్న సినిమా విషయాలకొస్తే.. పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగాజరుగుతుంది. ఇక ఈ సినిమా అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాతో పాటూ దర్శక ధీరుడు రాజమౌళి తో మరో సినిమా చేయనున్నాడు. ఇక ఈ సినిమాలు పూర్తయ్యాక ఈ ఇద్దరు డైరెక్టర్స్ లో మహేష్ ఎవరితో ముందు సినిమా చేస్తాడో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: