తెలుగులో టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన పూరి జగన్నాథ్ ప్రస్తుతం మంచి ఊపులో ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన పూరి కి ఆ సినిమా తర్వాత డైరెక్ట్ గా పాన్ ఇండియా సినిమా డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి తెరకెక్కిస్తున్న లైగర్ సినిమా మీద ఎన్ని అంచనాలు ఉన్నాయే అందరికి తెలిసిందే. దాదాపుగా 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో నడుస్తుంది. అయితే ఈ సినిమా ఇంకా పూర్తి అవ్వకముందే ఆయనకి బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో పూరి లైగర్ తర్వాత సినిమా చేయబోతున్నారు అని టాక్. ఈ సినిమా కథ రెడి చేసే పనిలో ప్రస్తుతం పూరీ ఉన్నాడట. అన్ని అనుకున్నట్టుగా జరిగితే వచ్చే ఏడాది ఈ సినిమా మొదలవ్వొచ్చు. ఈ సినిమాని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు అని టాక్.ఇక ఈ సినిమాతో ఇక పూరి కెరీర్ పీక్స్ లోకి వెళుతుంది అని ఆయన అభిమానులు అనుకుంటున్నారు. ఇక ఆయన చేస్తున్నలైగర్ సినిమా విషయానికి వస్తే ఈమధ్యనే ఒక్క అప్డేట్ తో లైగర్ సినిమా దేశమంతా సంచలనం సృష్టించింది. ప్రపంచం అంతా ఫేమస్ అయిన బాక్సర్ మైక్ టైసన్ ఈ సినిమాలో నటిస్తున్నారు అనే ఒక్క న్యూస్ లిగర్ మీద అంచనాలు ఆకాశాన్ని అందేలా చేసాయి.

ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కి జోడిగా అనన్య పాండే నటిస్తుంది. అలాగే నిర్మాతగా పూరితో పాటు కరణ్ జోహార్ కూడా లైగర్  నిర్మిస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది గ్రాండ్ గా విడుదల కాబోతుంది. సినిమాలో విజయ్ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: