తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండెల్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్మూవీ ని నిర్మిస్తున్నాడు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేసి ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు చాలా రోజులుగా ఓ వార్త వైరల్ అవుతుంది. 

మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఓ చిన్న వీడియోను విడుదల చేసింది. దానికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి భారీ "ఓ టి టి" డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ 40 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు దానితో ఈ మూవీ విడుదల అయిన కొన్ని వారాలు ముగిసిన తర్వాత ఈ సినిమాను తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" సంస్థ వారు స్ట్రీమింగ్ చేసుకోనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే తండేల్ మూవీ "ఓ టి టి" హక్కులు 40 కోట్ల ధరకు అమ్ముడు పోయాయి అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇక మంచి అంచనాలు కలిగి ఉన్న ఇన్మోవీ ఏ  రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: