అల్లు అర్జున్ కెరీర్లో ఫస్ట్ టైమ్ స్టైలిష్ స్టార్ ఇమేజ్ని పక్కనపెట్టి రగ్గడ్లుక్తో చేస్తోన్న సినిమా 'పుష్ప'. సుకుమార్ దర్శకత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాని క్రిస్మస్కి రిలీజ్ అవుతుందనే టాక్ వచ్చింది. కానీ 'ట్రిపుల్ ఆర్'తో జనవరి 7 నుంచే సంక్రాంతి మొదలవుతోందని, మినిమం 2 వీక్స్ గ్యాప్ కావాలని డిసెంబర్ 17నే బరిలో దిగుతున్నాడు సంక్రాంతి బరిలో ఇప్పటికే ఇద్దరు మెగాహీరోలు ఉన్నారు. రామ్ చరణ్ 'ట్రిపుల్ ఆర్'తో వస్తోంటే, పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' రిలీజ్ చేస్తున్నాడు. ఫిబ్రవరి 4న థియేటర్లలోకి వస్తున్నాడు 'ఆచార్య'.
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా అనగానే ఎన్.బి.కె. ఫ్యాన్స్కి బోల్డంత ఎనర్జీ వస్తుంది. 'సింహా, లెజెండ్' తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వస్తోన్న 'అఖండ' సినిమాపైనా భారీ అంచనాలున్నాయి. డిసెంబర్లోనే ఈ మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారట మేకర్స్. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున లాంటి హీరోలంతా సంక్రాంతిని వదిలేస్తోంటే రాజశేఖర్ మాత్రం శేఖర్ సినిమాని సంక్రాంతికి దింపాలనుకుంటున్నాడట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి