సమంత, అక్కినేని నాగచైతన్య విడిపోయి రెండు నెలలు దాటింది. అంతా సైలెంట్ గా ఉన్న టైంలో ఇప్పుడు మరో బాంబు పేల్చింది  సమంత. తన వ్యక్తిత్వానికి లింకు చేస్తూ విడాకుల వ్యవహారంపై రియాక్ట్ అయింది. విడాకుల తర్వాత చాలా బలహీనంగా మారిపోయానని, ఓ దశలో చనిపోతానేమో అనిపించింది అంటూ  కామెంట్ చేసింది. ఏ మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత కొద్దికాలంలోనే క్రెజ్  సంపాదించుకుంది. ఆ సమయంలోనే అక్కినేని నాగ చైతన్య తో పరిచయం పెరిగి ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ సినిమాల్లో ఇద్దరు కలిసి నటించారు. ఆ తర్వాత నాగచైతన్యను పెళ్లి చేసుకొని అక్కినేని సమంత గా మారిపోయింది. 2017 అక్టోబర్ 7న జరిగిన ఈ మార్పును ఆమె మనసారా ఆహ్వానించింది. టోటల్గా చై అండ్ సామ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేది టాలీవుడ్ లో ఒక లవ్లీ స్లోగన్ గా మారిపోయింది. అక్కినేని ఫ్యామిలీలో ఎంతగానో కలిసిపోయింది. కానీ ఉన్నట్టుండి ఏమైందో తెలియదు ఈ రొమాంటిక్ కపుల్ విడిపోయారు.

ఎన్నో రోజుల సుదీర్ఘ చర్చల తర్వాత తామిద్దరం విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు సమంత, చైతు. చాలా రోజుల తర్వాత సమంత విడాకుల వ్యవహారంపై ఎట్టకేలకు నోరు విప్పింది. జీవితంలో ప్రతి ఒక్కరికి మంచి రోజులు వస్తాయని, అలాగే చెడ్డ రోజులు వస్తాయని మంచి వచ్చినప్పుడు ఓకే అని చెడు వచ్చినప్పుడు ఒప్పుకోకపోతే లైఫ్ ముందుకు వెళ్లలేదంటు చెప్పుకొచ్చింది సమంత. కానీ ఈరోజు అన్నిటినీ తట్టుకుని నిలబడిన తీరు చూసిన తరువాత తన మీద తనకే గర్వంగా ఉందని చెప్పింది. తాను ఇంత ధైర్యంగా, దృఢంగా ఎలా ఉండగలిగానో తనకే అర్థం కాలేదు అన్నది. నాలుగు రోజుల క్రితం తన తల్లి తో చేసిన వాట్స్ అప్ చాట్ బయటపెట్టింది. నాలోని కొత్తదనం నీకు తెలియదు, విరిగిపోయిన నా ముక్కలన్నింటిని తిరిగి అతికిస్తా అంటూ ఉన్న కొటేషన్ ను సామ్ కు ఆమె తల్లి వాట్సాప్ లో షేర్ చేసింది. గాడ్ బ్లెస్స్ యు మై బేబీ అంటూ మెసేజ్ లు కూడా పంపించింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను సమంత తన ఇన్స్టా స్టోరీలో పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. విడాకుల తర్వాత కూతురు డిప్రెషన్లోకి వెళ్లకుండా సామ్ తల్లి ఇలా మోటివేట్ చేస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: