ఒకప్పుడు హీరోయిన్ గా అలరించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న రోజా ఆ తరువాత రాజకీయాల వైపు వెళ్లి సినిమాలకు పూర్తిగా దూరమైపోయిం.ది ఇక ఆ తర్వాత జబర్దస్త్ అనే కామెడీ షో లో జడ్జిగా అవతారమెత్తింది రోజా. అయితే ఒకప్పుడు హీరోయిన్గా సంపాదించుకున్న క్రేజ్ కంటే జబర్దస్త్ జడ్జిగా రోజా కాస్త ఎక్కువగానే క్రేజ్ సంపాదించుకుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు ఇక జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తన చిరునవ్వుతో ప్రతి తెలుగు ప్రేక్షకుడికి మరింత దగ్గరయింది రోజా.


 అయితే ఇక జబర్దస్త్ జడ్జిగా కొనసాగుతున్న సమయంలోనే రోజా ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. అయితే తాను ఎమ్మెల్యేగా గెలుపొందటానికి జబర్దస్త్ లోకి రావడం కూడా ఒక కారణం అంటూ అప్పట్లో చెప్పారు రోజా. ఇక ఇప్పుడు ఈ టీవీ లో ఏ కార్యక్రమం ప్రసారం అయిన అందులో రోజా ప్రత్యక్షమవుతారు.  సందడి చేస్తూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోతున్నారు. ఇకపోతే ఈ సంక్రాంతికి 'అమ్మమ్మగారి ఊరు' అంటూ ఒక స్పెషల్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు ఈ టీవీ లో. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రోజా ఎప్పటిలాగానే జడ్జీగా కనిపిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ కార్యక్రమం పై ఆసక్తి పెంచేందుకు 3 ప్రోమోలు విడుదల చేశారు.



 తాజాగా ఈ ఈవెంట్ కు సంబంధించి నాలుగో ప్రోమో కూడా విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమోలో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కూడా మైదానంలోకి దిగి ఏకంగా కబడ్డీ ఆడటం అందరిని ఆకట్టుకుంది. జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కబడ్డీ ఆడటం ఒక ఎత్తు అయితే ఇక జడ్జి రోజా కూడా కబడ్డీ ఆడి అలరించారు. ఈ క్రమంలోనే రోజా  కబడ్డీ లో భాగంగా రైడింగ్ కు వెళ్ళిన సమయంలో బాలెన్స్ తప్పి కింద పడిపోబోయారు. ఈ ప్రోమో చూస్తున్న సమయంలో ఎక్కడ రోజా కింద పడి పోతారో అని అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. కానీ ఆ తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకుని నిలబడ్డారు రోజ. ఇక ఆ తర్వాత ఆమని రైడింగ్ కు వచ్చిన సమయంలో రోజా ఆమెను పట్టుకునేందుకు వెళ్లగా ఇద్దరు కలిసి కిందపడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: