కరోనా వ్యతిరేక పరిస్థితులను లెక్కచేయకుండా విడుదల అవుతున్న ‘బంగార్రాజు’ మూవీకి భారీ కలక్షన్స్ తీసుకు రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు నాగ్ చేస్తున్నాడు. దీనికోసం సుమ యాంకరింగ్ తో జీ టివి సంక్రాంతి అల్లుళ్ళు కార్యక్రమాన్ని డిజైన్ చేసింది. దీనికి సంబంధించిన ప్రోమోలో నాగచైతన్య ‘డోంట్ మ్యారీ బీ హ్యాపీ’ అంటూ నాగార్జున గతంలో ‘మన్మధుడు’ సినిమాలో పాడిన పాటను తన గొంతుతో పాడి ఆ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ను హైలెట్ గా మార్చాడు.


చైతన్య ఈ కార్యక్రమంలో ఈ పాటను పాడుతుంటే నాగార్జున ఆపాటను నవ్వుతూ తెగ ఎంజాయ్ చేసాడు. ఇప్పుడు ఈ వీడియో ట్రెండింగ్ గా మారింది. ఈమధ్య ‘బంగార్రాజు’ మూవీ ప్రమోషన్ ఫంక్షన్ లో నాగచైతన్య దక్షానగర్కర్ తో బాగా నవ్వుతూ చైతూ మాట్లాడటానికి సంబంధించిన వీడియోను చూసిన వారు అక్కినేని కుటుంబానికి కోడలు దొరికింది అంటూ సోషల్ మీడియాలో హడావిడి మొదలుపెట్టారు.


ఇప్పుడు ఈవిషయాలు నాగచైతన్య దృష్టి వరకు రావడంతో తనపై మొదలైన గాసిప్పుల వ్యవహారానికి సమాధానంగా చైతూ ‘డోంట్ మ్యారీ బీ హ్యాపీ’ పాట పాడి ఉంటాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి నాగార్జున తీసుకున్న జాగ్రత్తలు ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి.


ఒకనాటి సంచలన సినిమా రచయిత సత్యానంద్ ఈమూవీ కథను నాలుగు వెర్షన్స్ గా వ్రాస్తే అందులో నాగార్జునకు నచ్చిన వెర్షన్ తో ఈ బంగార్రాజు నిర్మాణం అయింది అంటున్నారు. ఎన్ని వ్యతిరేక పరిస్థితులు ఉన్నా ఈమూవీ పై మ్యానియా తీసుకు రావడానికి నాగార్జున చాల వ్యూహాత్మకంగా వ్యవహారిస్తున్నాడు. ఇక సాధారణ కథతో కూడిన సీక్వెల్ మూవీకి ఇన్నిసార్లు ఆలోచించి కథ విషయంలో ఎందుకు కష్టపడ్డారు అన్న విషయం ప్రస్తుతానికి సస్పెన్స్. ఈమూవీ కథ దగ్గర నుండి పాటలు ఎడిటింగ్ అన్నీ తానై విజయమే లక్ష్యంగా చూసుకున్నాడు వెండితెర మన్మధుడు..



మరింత సమాచారం తెలుసుకోండి: