మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో నటించాలని ప్రతి హీరోయిన్ కోరుకుంటుంది. అయితే సాయి పల్లవికి మాత్రం త్రివిక్రమ్ నుంచి వచ్చిన ఒక ఆఫర్ పూర్తిగా కన్ఫ్యూజ్ చేస్తున్నట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో త్వరలో ప్రారంభం కాబోతున్న మూవీ కథ సిస్టర్ సెంటిమెంట్ తో నడిచే కథ అని తెలుస్తోంది.


గతంలో సిష్టర్ సెంటిమెంట్ తో వచ్చిన అనేక సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఈనాటి తరానికి మళ్ళీ ఆ సిష్టర్ సెంటిమెంట్ ను గుర్తు చేసే విధంగా ఈమూవీ కథను త్రివిక్రమ్ డిజైన్ చేసాడు అని అంటున్నారు. ఈమూవీ కథలో హీరో పాత్రతో సమానంగా సిష్టర్ పాత్రను త్రివిక్రమ్ చాల పవర్ ఫుల్ గా డిజైన్ చేసాడట. దీనితో ఈపాత్రకు సాయి పల్లవి అన్నివిధాల సరిపోతుందని భావించి ఆమెను సంప్రదించడమే కాకుండా ఆమెకు భారీ పారితోషికం ఆఫర్ చేసినట్లు టాక్.


అయితే ఇప్పుడు ఈ ఆఫర్ సాయి పల్లవిని కన్ఫ్యూజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఆమధ్య చిరంజీవి నటిస్తున్న ‘వేదాలం’ రీమేక్ లో సాయి పల్లవికి చెల్లెలు పాత్ర పోషించమని ఆఫర్ వచ్చింది. అయితే ఆ ఆఫర్ ను సాయి పల్లవి తిరస్కరించడంతో ఆమె స్థానంలో కీర్తి సురేష్ వచ్చి చేరింది. ఇలాంటి పరిస్థితులలో చిరంజీవి చెల్లిగా నటించడానికి తిరస్కరించి ఇప్పుడు మహేష్ చెల్లిగా నటిస్తే చిరంజీవిని తక్కువ చేసినట్లు అవుతుందా అన్న కన్ఫ్యూజన్ లో సాయి పల్లవి ఉన్నట్లు టాక్.


అయితే త్రివిక్రమ్ మూవీలో నటించే అవకాశం వదులు కోవడం సాయి పల్లవికి ఏమాత్రం ఇష్టం లేదు అన్నప్రచారం కూడ జరుగుతోంది. గతంలో మహేష్ పక్కన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుందని లీకులు వచ్చాయి. అయితే ఆమె స్థానంలో రష్మిక వచ్చి చేరింది. దీనితో హీరోయిన్ గా ఛాన్స్ మిస్ అయిన సాయి పల్లవి చెల్లిగా సెటిల్ అవుతుందో లేదో చూడాలి..




మరింత సమాచారం తెలుసుకోండి: