ప్రస్తుతం ఓటిటి వేదికగా ప్రసారమవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం చివరి అంకానికి చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే సండే రోజున ఎలిమినేషన్ తర్వాత కేవలం హౌస్ లో ఏడు మంది కంటెస్టెంట్స్ మాత్రమే కొనసాగుతున్నారు. కాగా రెండవసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన నటరాజ్ మాస్టర్ ఈసారి కూడా తొందరగానే ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చాడూ  అందరూ అనుకున్నట్లుగా టాప్ ఫైవ్ లో నిలుస్తాడూ అని అనుకున్నప్పటికీ ఆయన బిహేవియర్ కారణంగానేనటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడూ అని తెలుస్తోంది.


 అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్స్ మొత్తం మీద పడి పోయి మరి కంటెస్టెంట్స్ ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నటరాజ్ మాస్టర్ ఈ వారం ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాడో లేదో నట్రాజ్ మాస్టర్  ను ఇంటర్వ్యూ చేయడానికి యూట్యూబ్ చానల్స్ అన్నీ కూడా మీద పడిపోయాయి. ఇక నట్రాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యి బయటకు రాగా.. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు రావడం గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అడగగా షాకింగ్ కామెంట్స్ చేశాడు నట్రాజ్ మాస్టర్.


 తను ఎంతో కష్టపడి గేమ్ ఆడానని అయినప్పటికీ కూడా తనకు ఓట్లు రాలేదని.. బయటకు వచ్చిన తర్వాత చెక్ చేసి చూస్తే సోషల్ మీడియాలో ఫేక్ ఓట్లను వేసుకుంటున్నారని అర్థమైంది అంటూ నట్రాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దొంగ ఓట్ల కారణంగానే వాళ్ళు ఇంకా హౌస్ లో ఉన్నారని నిజాయితీగా ఆడిన నేను బయటకు వచ్చాను అంటు కామెంట్ చేశారు నట్రాజ్ మాస్టర్. బిగ్ బాస్ అసలు విన్నర్ నేనని అందరివి దొంగ ఓట్లు అంటూ నట్రాజ్ మాస్టర్ అన్నాడు.. ఈ వీడియో కాస్త ప్రస్తుతం మహిళలు గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: