దర్శకుడు విక్రమ్ కె కుమార్ కమర్షియల్ సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ డిఫరెంట్ జోనర్ సినిమాలను మరియు ప్రేమకథ సినిమాలను తెరకెక్కిస్తూ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. అలాంటి దర్శకుడు ఆఖరుగా నాని హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మంచి అంచనాల నడుమ విడుదలైన గ్యాంగ్ లీడర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇలా గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన విక్రమ్ కె కుమార్ తాజాగా థాంక్యూ మూవీ కి దర్శకత్వం వహించాడు. నాగ చైతన్య హీరోగా నటించిన ఈ మూవీ లో రాశి కన్నా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి థమన్ సంగీతాన్ని అందించగా, దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను జూలై 22 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో విక్రమ్ కె కుమార్ ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా అనేక ఇంటర్వ్యూలలో పాల్గొంటూ వస్తున్నాడు.

ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు విక్రమ్ కె కుమార్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 24 మూవీ ఎంత మంచి విజయాన్ని సాధించిందో మన అందరికి తెలిసిందే.  తాజా ఇంటర్వ్యూలో విక్రమ్ కె కుమార్ 24 మూవీ సీక్వెల్ గురించి మాట్లాడుతూ... 24 మూవీ కి సీక్వెల్ ని చేయాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నా , కొన్ని రోజుల క్రితం చిన్న క‌థను కూడా అనుకొన్నాను. ఆ కథపై చాలా బాగా ప‌ని చేయాలి. అప్పుడే ఆ మూవీ ని తెర‌పైకి తీసుకెళ్లాలి అని విక్రమ్ కె కుమార్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: