సూపర్  స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సూపర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ తల్లి గారు ఇందిరా దేవి గారు మృతి చెందడంతో మహేష్ బాబు సినిమాకి కాస్త బ్రేక్ తీసుకున్నారు. తన తల్లిగారికి సంబంధించిన పనులు అన్నీ అయిపోయాకా ఆ తరువాత ఆ బాధని మర్చిపోడానికి మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి లండన్ విహార యాత్రకు వెళ్లడం తెలిసిందే. ఇక ఆ ట్రిప్ ముగించుకొని మళ్ళీ తిరిగి మహేష్ హైదరాబాద్ చేరుకున్నారు. కానీ సినిమా షూటింగ్ తరువాతి షెడ్యూల్ అయితే ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపించడం లేదు.ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్సినిమా స్క్రిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ ని మహేష్ కి వినిపించలేదట. ఆ కారణంగానే ఈ సినిమా షూటింగ్ బాగా ఆలస్యం అవుతూ వస్తోంది. రీసెంట్ గా ఫైనల్ స్క్రిప్ట్ ని మహేష్ బాబుకి త్రివిక్రమ్ వినిపించగా మహేష్ బాబుకి సూపర్ గా నచ్చేసిందట. అయితే తరువాతి షెడ్యూల్ లో హాట్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా వుండాలి.ఎందుకంటే ఆమె మహేష్ తో కలిసి చేసే కాంబినేషన్ సీన్స్ వున్నాయట.


అయితే ఇటీవల పూజా హెగ్డే కాలికి గాయం అవ్వడంతో ఆమె కూడా షూటింగ్ కి బ్రేక్  ఇచ్చి రెస్ట్ తీసుకుంటోంది. డిసెంబర్ నెలకి కానీ పూజా సెట్లో అడుగుపెట్టే పరిస్థితి కనిపించడం లేదు.అందువల్ల ఈ మూవీ తరువాతి షెడ్యూల్ ని డిసెంబర్ నెలలో మొదలు పెట్టాలని సన్నాహాలు చేస్తున్నారట. అప్పుడు పూజా హెగ్డే గాయం నయం కానుంది కాబట్టి తను కూడా సెట్ లోకి రావడానికి అప్పుడు రెడీగా వుంటుంది. అందుకే డిసెంబర్ నెలలో షూటింగ్ తరువాతి షెడ్యూల్ ని ప్రారంభిస్తారని సమాచారం తెలుస్తోంది. అందుకే ఈ గ్యాప్ లో మహేష్ మరోసారి ట్రిప్ కి వెళుతున్నాడట.అయితే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కొన్ని ట్యూన్స్ కంపోజ్ చేసి మహేష్ కి త్రివిక్రమ్ కి వినిపించాడట. అయితే మహేష్ కి ఆ ట్యూన్స్ నచ్చలేదట. త్రివిక్రమ్ కూడా ఆ ట్యూన్స్ పై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది. దీంతో మహేష్ థమన్ ని తొలగించి వేరే మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకుందాం అని త్రివిక్రమ్ కి సూచించాడట. ప్రస్తుతం దీనిపై చర్చలు నడుస్తున్నాయి. మరి చూడాలి ఫైనల్ గా ఏమవుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: