విక్టరీ వెంకటేష్ గత ఏడాది F -3 సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడం జరిగింది. ఆ తర్వాత వీశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా చిత్రంలో గెస్ట్ రోల్ పాత్రలో కనిపించారు. ఇటీవలే తన మైల్ స్టోన్ మూవీని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. తన కెరియర్ లోనే 75వ చిత్రంగా యువ దర్శకుడితో ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి వెంకటేష్ సిద్ధమయ్యారు. ఈ సినిమా క్రైమ్ సిరీస్ తో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిపించుకుంటున్న డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ అనే సినిమాని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది.

సినిమా ప్రకటిస్తూనే విడుదల చేసిన వీడియో గ్లింప్స్ ఆడియన్స్ లో మూవీ పైన భారీగా అంచనాలని క్రియేట్ చేస్తున్నాయి.  ఆ వీడియోలో వెంకటేష్ మిషన్ గన్ను పట్టుకొని ఉండడం చూస్తూ ఉంటే కచ్చితంగా ఈ సినిమా యాక్షన్ త్రిల్లర్గా తెరకెక్కించబోతున్నట్లు అర్థమవుతున్నది. అలాగే గ్లింప్స్ ఒక మెడికల్ డ్రగ్ని ప్రత్యేకంగా చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక కథ వైరల్ గా మారుతోంది. ఆ డ్రగ్ చిన్నపిల్లలకి ఇచ్చే రేర్ మెడిసిన్ అన్నట్లుగా తెలుస్తోంది. అది చాలా రేటు ఉంటుందని ఆ డ్రగ్ తనకు సంబంధించిన పిల్లవాడికి వెంకటేష్ సంపాదించే ప్రయత్నంలో ఈ సినిమా కథ అన్నట్లుగా సమాచారం.


కాగ ఈ సినిమా కూడా ఉగాది సందర్భంగా క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. ఈరోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతున్నట్లు ఈ విషయాన్ని వెంకటేష్ తెలియజేయడం జరిగింది. రాంపేజ్ రోలింగ్ అంటూ ఒక మాస్ పోస్టర్తో ఈ సినిమాని విడుదల చేశారు. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించడం జరుగుతోంది పాన్ ఇండియా మార్కెట్లోకి మొదటిసారిగా వెంకటేష్ కూడా అడుగు పెట్టబోతున్నారు. మరియు సరికొత్త కదా అంశంతో ప్రేక్షకులను ఏవిధంగా ఆకట్టుకుంటారో చూడాలి మరి వెంకటేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: