వరస ఫ్లాప్ లతో ఉన్న ప్రభాస్ ‘సలార్’ తో తిరిగి ట్రాక్ లోకి వస్తాడని అభిమానుల అంచనా. ఈసినిమా విడుదల తేదీ డగ్గర పడుతూ ఉండటంతో ఈమూవీకి సంబంధించిన అనేక వార్తలు గాసిప్పులు సోషల్ మీడియాకు లీక్ అవుతున్నాయి. ఈసినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుండి అనుమతులు లభిస్తే ఈమూవీని 21 అర్థరాత్రి తెల్లవారితే 22న 12 గంటల 22 నిముషాల 22 సెకన్స్ కు ప్రీమియర్ షోలు వేయాలని ప్రభుత్వ అనుమతుల కోసం ఈమూవీ నిర్మాతలు చాల ముందుగానే అప్లయి చేయాలని నిశ్చయించినట్లు వార్తలు వస్తున్నాయి.



అంతేకాకుండా ఈసినిమా మొదటి వారం రోజులకు టిక్కెట్ల ధర పెంపుకు అనుమతులు ఇవ్వాలని నిర్మాతలు ప్రభుత్వ పెద్దలను కోరే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఈ వార్తలు ఇలా కొనసాగుతూ ఉండగా ఈమూవీ క్లైమాక్స్ లో ‘కేజీ ఎఫ్’ హీరో ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో కలిసి కొన్ని నిముషాల పాటు కనిపిస్తాడాని కన్నడ మీడియా వార్తలు రాస్తోంది.  



అయితే దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన నిర్మాతల నుండి లేకపోవడంతో ఈవార్త నిజంగా యాదార్థమా లేదంటే సోషల్ మీడియా గాసిప్ అనుకోవాల అన్న కన్ఫ్యూజన్ లో ప్రభాస్ అభిమానులు ఉన్నారు.  ఆమధ్య విజయ్ నటించిన ‘లియో’ లో మూవీలో రామ్ చరణ్ అదేవిధంగా ‘టైగర్ 3’ లో జూనియర్ ఎన్టీఆర్ అతిధి పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే అయితే అది ఏమాత్రం వాస్తవం కాదు.



ఇప్పుడు యష్ ‘సలార్’ లో కొద్దిసేపు కనిపించే విషయం కూడ అలాంటి గాసిప్ గా మారుతుందా అన్న సందేహాలు కొందరిలో ఉన్నాయి. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ కు యష్ కు సాన్నిహిత్యం రీత్యా ఇలాంటి మ్యాజిక్ ఏదోఒకటి ‘సలార్’ లో ఉండినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఇది ఇలా ఉంటే డిసెంబర్ 1న విడుదల అయ్యే ట్రైలర్ గురించి అందరు ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: