మలయాళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈ బ్యూటీ "అ ఆ" అనే సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయ్యింది. ఈ మూవీ మంచి సక్సెస్ అందుకోవడం అలాగే ఇందులో ఈమె తన నటనతో, అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత ఈమెకు వరుసగా తెలుగులో అవకాశాలు దక్కాయి.

అందులో భాగంగా ఇప్పటివరకు అనేక తెలుగు చిత్రాలలో నటించిన అనుపమ చాలా విజయాలను అందుకొని ఇప్పటికి కూడా మంచి జోష్ ఉన్న నటిగా కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ టిల్లు స్క్వేర్ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీలో హీరోయిన్ గా నటించింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా ... సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీని నిర్మించాడు.

మార్చి 29 వ తేదీన విడుదల అయ్యి ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని భారీ లాభాలను అందుకున్న నేపథ్యంలో ఈ మూవీ యూనిట్ నిన్న భారీ ఎత్తున సక్సెస్ ఈవెంట్ నిర్వహించింది. దానికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇక నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో భాగంగా అనుపమ మాట్లాడడానికి మైక్ పట్టుకుంది.

ఆమె మైక్ పట్టుకున్న తర్వాత జనాలు అంతా పెద్దగా అరుస్తూ గోల గోల చేశారు. దానితో అనుపమ ఇప్పుడు నేను మాట్లాడాలా..? వద్దా..? అని అభిమానులనే నేరుగా అడిగింది. దానితో అభిమానులు కూడా వద్దు అని అనడంతో ఆమె కంగుతుంది. దానితో ఆమె చివరగా మైక్ తీసుకొని సినిమాను సక్సెస్ చేసిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపి తన స్పీచ్ ను ముగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: