ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం "పుష్ప పార్ట్ 2" మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మిస్తూ ఉండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఫహద్ ఫజిల్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ , సునీల్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది. ఇందులో డైలాగులు లేకపోయినప్పటికీ ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ మూవీ టీజర్ లో డైలాగులు లేవు అనే విషయంలో అల్లు అర్జున్ అభిమానులు కాస్త డిసప్పాయింట్ కావడంతో మరో టీజర్ ను డైలాగులతో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ లోని ఫస్ట్ సింగిల్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు.

ఇక ఈ ప్రోమాను విడుదల చేసిన రోజే ఈ ఫుల్ సాంగ్ ను మే 1 వ తేదీన ఉదయం 11 గంటల 07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. ఇకపోతే ఈ ఫుల్ సాంగ్ విడుదల లోపు ఈ మూవీ బృందం రెండో ప్రోమో ను రిలీజ్ చేయబోతోంది అని , దానితో పుష్ప యూనిట్ ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇవ్వబోతుంది అని ఓ వార్త వైరల్ అయింది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప యూనిట్ ఎలాంటి సర్ప్రైజ్ లేకుండా మే 1 వ తేదీన ఉదయం 11 గంటల 07 నిమిషాలకు ఈ మూవీ లోని మొదటి పాటను నేరుగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa